బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ 

‘జియో’ పోటీని తట్టుకునేందుకు పోటీ టెలికాం సంస్థలు కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కొత్త ఆఫర్ తో వినియోగదారుడిని ఆకట్టుకునేందుకు ముందుకొచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే ల్యాండ్ లైన్ ఖాతాదారులే లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఆదివారం పూర్తి రోజూ అలాగే, మిగిలిన రోజులు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్‌వర్క్ కు అయినా అపరిమిత కాల్స్‌ చేసుకునేందుకు కొత్త టారీఫ్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 49 చెల్లించి ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

కొత్త ఖాతాదార్లకు మాత్రమే ఈ ఆఫర్‌ అవకాశం కల్పిస్తుంది. దీని కాలపరిమితి 6 నెలల వరకు ఉంటుంది.

గతంలో రూ.99 కి ఈ ఆఫర్ ఉండేది. అయితే ఇప్పుడు అది రూ. 49 వస్తోంది.