ఇంకా అక్కడ పాతనోట్లు చెల్లుతాయి
- వాహనదారులకు కేంద్ర ఊరట
- పాతనోట్లతో టోల్ రుసుం చెల్లింపునకు ఓకే
పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కేంద్రం మరోసారి టోల్ రుసుము పై మరో ప్రకటన చేసింది.
పాత రూ.500 నోట్లతో టోల్ రుసుం చెల్లింపునకు గడువును పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన చేసింది.డిసెంబర్ 15 వరకు పాత రూ.500 నోట్లతో టోల్ రుసుం చెల్లించే అవకాశం కల్పించారు. క్రెడిట్, డిబిట్, ఈవ్యాలెట్ ద్వారా టోల్ రుసుం చెల్లింపులకు ఏర్పాట్లు చేశారు.
శాంతి భద్రతల నిర్వహణ కోసం టోల్గేట్ల వద్ద బలగాలు తరలిస్తున్నట్లు పేర్కొంది.