ఫోన్ రిచార్జ్ కు పెద్ద నోటు ఓకే
- వెసులుబాటు ఇచ్చిన కేంద్రం
రద్దైన పెద్ద నోట్లు రూ.500, రూ.1000 లతో మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
నోట్ల మార్పిడిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ఐదొందలు, వెయ్యి నోట్లను బ్యాంకుల్లో తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోనేందుకు అనుమతివ్వడం తెలిసిందే.
అదే సమయంలో ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, రైల్వేలకు, టోల్ ప్లాజాల వద్ద వాడవచ్చని పేర్కొంది.
చివరగా ఫోన్ రీచార్జ్ కు కూడా రద్దైన పాత నోట్లను వాడుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రీపెయిడ్ ఫోన్ల రీఛార్జింగ్కు మాత్రమే ఇది వర్తిస్తుంది.