(video) క్లాసులకు డుమ్మాలు.. గంజాయి దమ్ములు
- ఇంజనీరింగ్ విద్యార్థుల బాగోతం
ఇంజనీరింగ్ కాలేజ్ లో పాఠాలు వినాల్సిన బీటెక్ బాబులు ఇలా నడిరోడ్డుపై గంజాయి పీల్చుతూ భవిష్యత్తు భారతాన్ని కెమెరాల ముందు ఆవిష్కరిస్తున్నారు.కర్ణాటక రాజధాని బెంగళూరులోని హనుమంతప్ప నగర్ లో కొంత మంది స్టూడెంట్స్ ఇలా గంజాయి పీల్చుతూ చిట్ చాట్ చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు సోదాలు జరిపినా స్టూడెంట్స్ చేతిలో గంజాయి ప్యాకెట్లు దొరుకుతూనే ఉన్నాయి. నగరంలోని ఓ నైజీరియన్ ముఠా ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ఈ డ్రగ్స్ మాఫియాను నడుపుతున్నట్లు తెలుస్తోంది.