నకిలీ బంగారం డిపాజిట్ చేసిన మోసగాళ్లు బండారం బయటపడటంతో 72 మందికి జైలు
భద్రతకు భరోసాలా ఉండే బ్యాంకునే కొందరు బురిడీ కొట్టించారు. నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి లక్షల రూపాయిలతో ఉడాయించారు.
2009లో గుంటూరు జిల్లా భట్టిప్రోలులోని ఆంధ్రా బ్యాంకులు పథకం ప్రకారం కొందరు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందారు. దీనిపై 2010లో పోలీసు కేసు నమోదైంది.
ఏడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు బ్యాంకును బురిడీ కొట్టించిన 72 మందికి విక్ష ఖరారు చేసింది. ఒక్కోరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్త తీర్పునిచ్చింది.
