చిల్లర లేక రూ. 5 కు చెక్కు రాసిచ్చిన వ్యక్తి
మోదీ ప్రకటనతో పెద్ద నోట్లు రద్దై.. దేశమంతా బ్యాంకుల మందు బార్లా తీరుతోంది.. ఏటీఎంల ముందదు క్యూ కడుతోంది...చిల్లర లేక ప్రజలందరూ నానా కష్టాలు పడుతున్నారు. పనులు మానుకొని బ్యాంకుల ముందు పడిగాపులు కడుతున్నారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల అనేక ఇబ్బందులే కాదు... చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి.ముంబైలో హ్యాండ్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ ను ఓ యువతి ఏటీఎం క్యూ లోనే కనిపెట్టి చితగొట్టింది.ఉత్తరప్రదేశ్ లో బ్యాంకు క్యూలో నిలబడి ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదీ అలాంటి సంఘటనే.. తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి అర్జెంటుగా యూరినల్స్ కు వెళ్లాల్సిన పరిస్థితి... చేతిలో ఉన్న డబ్బు చెల్లడం లేదు. దీంతో మరుగుదొడ్డి వినియోగించుకున్నందుకు ఏకంగా చెక్కు బుక్ నే వినియోగించుకున్నారు.చెల్లించాల్సిన 5 రూపాయిలను చెక్కు రూపంలో రాసిచ్చాడు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేరుతో ఉన్న ఈ రూ. 5 చెక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
