గవర్నర్ కోరిక నెరవేరింది
రాజ్ భవన్ విందుకు హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఎట్టకేలకు గవర్నర్ కోరిక నెరవేరింది. తెలుగు రాష్ట్రాల సీఎంలను ఒకే దగ్గరికి తీసుకరావాలని ప్రయత్నించిన గవర్నర్ నరసింహన్ చివరకు ఆ పని చేశారు. దీనికి రాజ్ భవన్ వేదికైంది.
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
ఈ విందులో ఇద్దరు చంద్రులు చాలా సమయం మాట్లాడుకోవడం గమనార్హం.
విందుకు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు తదితరులు హాజరయ్యారు.