ప్రజా సంకల్పయాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర
- జగన్ పై విమర్శల వర్షం కురిపించిన మంత్రి పత్తిపాటి
- జగన్ చేసేది ప్రజా వంచన యాత్ర అని ఆరోపించిన మంత్రి
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ప్రజా సంకల్ప యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఉదయం నుంచి జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ రెండో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శల దాడికి దిగారు. జగన్ చేసేది ప్రజా వంచన యాత్ర అని దుయ్యబట్టారు.
ప్రపంచంలో ఎక్కడ ఆర్థిక నేరాలు జరిగినా..అందులో కచ్చితంగా జగన్ పేరు ఉంటుందని పత్తిపాటి ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ కనీసం పులివెందలలో కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు.