కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు దౌర్జన్యం వైసీపీ నేతపై దాడికి పాల్పడ్డ మంత్రి ఉమా అనుచరులు

కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైసీపీ నేతపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన జి. కొండూరు మండలం గంగినేని పాలెంలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. వైసీపీ అధినేత జగన్.. సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ..వైసీపీ నేత భూక్యా కృష్ణ ఆలయంలో పూజలు చేశారు.

జగన్ కోసం పూజలు చేయడం చూసి సహించలేని మంత్రి దేవినేని ఉమా అనుచరులు.. భూక్యాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వైసీపీ నేత కి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం భూక్యా.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.