ఇండియాలో ఫ్రీగా చైనా ఇంటర్నెట్
- ముందుకొచ్చిన అలీబాబా
ఇండియాలోని ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు పైసా చెల్లించకుండా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.
దీనికి మేం అవకాశం కల్పిస్తామంటు ముందుకొచ్చింది చైనా కు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబు.
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ-కామర్స్ సంస్థ గా అలీబాబాకు మంచి పేరుంది. ప్రస్తుతం ఈ సంస్థ భారత్ లో ప్రముఖ టెలికాం సంస్థలతో జతకట్టి దేశమంతా ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది. చైనాలో ఇప్పటికే యూసీ వెబ్ పేరుతో ఈ సంస్థ నెట్ సౌకర్యాన్ని అందిస్తోంది.
అయితే ట్రాయ్ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలి. గతంలో కూడా ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు ఫ్రీ ఇంటర్నెట్ కు సంబంధించి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.