బస్సు బోల్తా -9మంది మృతి
- దైవ క్షేత్రాలకు బయలుదేరి వెళుతుండగా ప్రమాదం
- 22మందికి గాయాలు
బస్సు బోల్తా పడి 9మంది మృతి చెందిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గుజరాత్ నుంచి
బస్సు భక్తులతో దైవ క్షేత్రాల దర్శనకు బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్లోని
ఉదయ్పూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స
నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఉదయ్పూర్ ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. చనిపోయిన వారిలో
ఆరుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది 45ఏళ్ల వయసు పైబడిన వాళ్లే ఉన్నారని ఎస్పీ తెలిపారు.