బెంగళూరులో 24 ఏళ్ల ఓ యువకుడు తన జీవితసహచరిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపేశాడు. అనుమానమే దీనికి కారణంగా తెలుస్తోంది. 

బెంగళూరు : బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ తరహాలో బెంగళూరులో ఓ మహిళ మృతి చెందింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఓ జంటలోని యువతిపై యువకుడు కుక్కర్ తో దాడి చేసి చంపేశాడు. 

24 ఏళ్ల తన సహజీవన భాగస్వామి తనను మోసం చేసిందని అనుమానించిన ఆమె లైవ్ భాగస్వామి ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపారు. నిందితుడు వైష్ణవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని బేగూర్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియా అధికారులు కక్ష కట్టారు.. తాగే నీళ్లలోనూ విషం కలిపారు... ఎన్నారై మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్....

పోలీసుల కథనం ప్రకారం, కేరళకు చెందిన 24 ఏళ్ల వైష్ణవ్, దేవా గత మూడేళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నారు. "గత కొన్ని రోజులుగా... నిందితుడికి తన లిన్ ఇన్ భాగస్వామి అయిన మహిళపై అనుమానాలు ఉన్నాయి. తరచుగా ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగేది. నిన్న అదే జరిగింది. వారి గొడవ ఘర్షణకు దారితీసింది. 

అతను ఆమెను ప్రెషర్ కుక్కర్‌తో కొట్టాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలియడంతో మేం అతనిని అరెస్టు చేశాం. దీనిమీద విచారణ కొనసాగుతోంది”అని సీనియర్ పోలీసు అధికారి సికె బాబా తెలిపారు. బేగూర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.