ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే తమ టార్గెట్ అంటూ ఓ అగంతకుడు ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కాల్ చేసి బెదిరించాడు. మరో సారి 26/11 ముంబై తరహా దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు.
యోగి ఆదిత్యనాథ్, మోడీ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి బెదిరించాడు. కొన్ని చోట్ల తూటాలు, ఏకే-47లు ఉన్నాయని, ముంబైలో 26/11 తరహా దాడి పునరావృతం అవుతుందని హెచ్చరించాడు.
‘‘యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోడీ ప్రభుత్వం టార్గెట్ గా ఉందంటూ ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. 26/11 తరహా ఉగ్రదాడికి సిద్ధమని నిందితులు బెదిరించారు. ఐపీసీ సెక్షన్ 509(2) కింద కేసు నమోదు చేశారు’’ అని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ పేర్కొంది. కాగా.. కంట్రోల్ రూమ్ కు కాల్ చేసిన అగంతకుడి కోసం ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఆ గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 509(2) కింద వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పాకిస్థాన్ నుంచి పారిపోయి నేపాల్ మీదుగా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన సీమా హైదర్ తిరిగి స్వదేశానికి పంపించాలని, లేకపోతే 26/11 తరహా ఉగ్రదాడికి పాల్పడతానని ముంబై పోలీసులకు జూలై 12న మరో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అందులో ఆ వ్యక్తి ‘సీమా హైదర్ తిరిగి రాకపోతే భారత్ నాశనమవుతుంది. దాడి జరిగితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని చెప్పారు. అయితే ఇది ఫేక్ కాల్ అని ముంబై పోలీసులు తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించారు.
ఆస్ట్రేలియా బీచ్ లోని మిస్టరీ వస్తువు చంద్రయాన్ -3 శకలమేనా ? ఫొటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ..
కాగా.. 2019లో గేమింగ్ యాప్ పబ్జీలో మాట్లాడుకుంటున్న సమయంలో సీమా, యూపీలో ఉండే సచిన్ ప్రేమలో పడ్డారు. దీంతో ఆమె నేపాల్ మీదుగా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. తరువాత సచిన్, సీమ, నలుగురు పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. అయితే ఆమె నేపాల్ మీదుగా వీసా లేకుండా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినందుకు జూలై 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించినందుకు సచిన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ శుక్రవారం బెయిల్ మంజూరైంది.