సారాంశం

పంటి నొప్పి తగ్గించుకునేందుకు ఓ యువకుడు యూట్యూబ్ వీడియోలో చెప్పిన రెమెడీ పాటించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుుకంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు అతడు విష పదార్థం ఉండే విత్తనాలు తిన్నాడని డాక్టర్లు తెలిపారు. 

ప్రజల దైనందిన జీవితంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో భాగమైన యూట్యూబ్ ఎక్కువ మంది జనాలను ఆకర్షిస్తోంది. ప్రతీ రోజూ ఇందులో లక్షల సంఖ్యలో వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ఇందులో అనేక రకాల వీడియోలు లభిస్తున్నాయి. ఇందులో అందరి అభిరుచికి తగిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. 

అయ్యో.. వరద నీటిలో పడి చనిపోయిన బాలుడి మృతదేహాన్నివెలికి తీస్తూ.. మునిగిపోయిన పోలీసు ఆఫీసర్.. వీడియో వైరల్

ఈ యూట్యూబ్ ను అనేక మంది అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొందరు యూట్యూబ్ ను జీవనాధారంగా చేసుకొని కంటెంట్ అప్ లోడ్ చేస్తుంటే.. మరి కొందరు అందులోని కంటెంట్ ను ఉపయోగించి నాలెడ్జ్ , స్కిల్స్ పెంచుకుంటున్నారు. ఇంకొందరు సరదాగా వాటిని చూస్తూ గడిపిస్తున్నారు. ఈ మధ్య ప్రజల్లో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెరిగింది. దీంతో చాలా మంది ఆరోగ్యాభిలాషులు యూట్యూబ్ లోనే ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనల వీడియోలు చూస్తున్నారు.

అయితే కొందరు ఆ వీడియోల్లో చెప్పిన రెమెడీలు పాటించి ఇబ్బందులకు గురైన సందర్భాలు గతంలో వెలుగు చూశాయి. తాజాగా  జార్ఖండ్ లోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. యూట్యూబ్ లో చెప్పిన సలహా పాటించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి యూట్యూబ్ వీడియోలు చూసి.. అందులో చెప్పినట్టుగా కెనెర్ (ఒలియాండర్) విత్తనాలను తిని, పరిస్థితి విషమించి చనిపోయాడు.

ఆస్ట్రేలియా బీచ్ లోని మిస్టరీ వస్తువు చంద్రయాన్ -3 శకలమేనా ? ఫొటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ..

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. జార్ఖండ్ లోని బొకారో జిల్లాలోని నవాదిహ్ బ్లాక్ కు చెందిన అజయ్ మహతో (26).. హజారీబాగ్ పట్టణానికి సమీపంలోని హజారీబాగ్ ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతన్ నగర్ కాలనీలో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. వారం రోజుల కిందట అతడికి పంటి నొప్పి మొదలైంది. దీంతో దాని నుంచి ఉపశమనం పొందడానికి యూట్యూబ్ ను ఆశ్రయించాడు. 

భర్త నుంచి దూరంగా ఉండే మహిళ.. వివాహితుడైన స్నేహితుడితో కలిసి ఉండాలని.. యూట్యూబ్ లో చూస్తూ..

అందులో పంటి నొప్పి తగ్గేందుకు చిట్కాలను చూశాడు. ఆ వీడియోల్లో చెప్పినట్టుగా కెనెర్ (ఒలియాండర్) విత్తనాలు తిన్నాడు. కొంత సమయం తరువాత అతడి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అతడిని హజారీబాగ్ లోని బిష్ణుఘర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అయితే అక్కడికి వచ్చేసరికే అజయ్ మరణించాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై హజారీబాగ్ సివిల్ సర్జన్ ఎస్పీ సింగ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. కనేర్ విత్తనాలు చాలా ప్రమాదకరమైనవని అన్నారు. అవి కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా కావచ్చని అన్నారు. యువకుడిని హాస్పిటల్ కు తీసుకురాకముందే చనిపోయాడని చెప్పారు.