యోగి ఆదిత్యనాథ్ కాషాయ బట్టలు ధరించడం మానేయాలి - కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వార్.. మండిపడ్డ బీజేపీ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధరించే కాషాయ వస్త్రాలపై మరో సారి చర్చ మొదలైంది. గతంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సీఎం దుస్తులపై వ్యాఖ్యలు చేసి ఈ చర్చను మొదలుపెట్టారు. తాజాగా మరో కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్ దల్వార్ యోగి బట్టలపై మాట్లాడారు. దీనిపై బీజేపీ మండిపడింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్ దల్వార్ అన్నారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో వ్యాపారాన్ని ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు.
భారత్ జోడోను ఎవరూ వ్యతిరేకించలేరు: రామ మందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ నేత రామ్ కదమ్ దల్వార్ మాట్లాడుతూ.. ‘‘ హిందూ మతానికి పవిత్ర రంగు అయిన కాషాయంపై కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకి ఎందుకు అంత ద్వేషం’’ అని ప్రశ్నించారు. కాషాయ రంగు మన జెండా, ఋషులు, సాధువుల దుస్తుల రంగు మాత్రమే కాదు. ఇది త్యాగం, సేవ, జ్ఞానం, స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు చిహ్నం’’ అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడి ప్రకటన కాషాయ వేషధారణతో ఉన్న దేశ దార్శనికులను, సాధువులను అవమానించడమే అవుతుందని తెలిపారు.
గతంలో ప్రియాంక గాంధీ కూడా..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దుస్తులపై 2019లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన యోగి మాదిరిగా దుస్తులను ధరిస్తాడు. ఆయన కాషాయ బట్టలు వేసుకుంటారు. ఈ భాగవ (కుంకుమ) మీది కాదు. ఇది హిందూస్తాన్ ‘ధార్మిక’(మతపరమైన), ‘ఆధ్యాత్మిక’ హిందూస్థాన్ సంప్రదాయానికి చెందినది.’’ అని అన్నారు. ‘‘ ఇది హిందూ మతానికి చిహ్నం. మనం ధర్మం కోసం ఆ మతాన్ని అవలంబించండి. ఆ మత౦లో కోపానికి, దౌర్జన్యానికి, ప్రతీకారానికి చోటు లేదు. నేను చెప్పవలసిందల్లా ఇదే’’ అని ఆమె అన్నారు.
కాగా.. ఈ వ్యాఖ్యలపై సీఎంవో స్పందించింది. సర్వం త్యాగం చేసిన తర్వాత ప్రజా సేవ కోసం కాషాయ దుస్తులు ధరించారని ప్రియాంక గాంధీ కామెంట్స్ ను తిప్పికొట్టింది. ‘‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజా సేవ కోసం కాషాయ రంగును ధరించారు ( సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ నే భగ్వా లోక్ సేవ కే లియే ధరన్ కియా హై).’’ అని ట్వీట్ చేసింది.
యుఎస్లో షాకింగ్.. విమానం ఇంజిన్ గుంజేయడంతో ఎయిర్పోర్ట్ వర్కర్ మృతి..
‘‘ఆయన కాషాయ వస్త్రాలు ధరించడమే కాదు. దానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాషాయ రంగు దుస్తులు ప్రజా సంక్షేమం, దేశ నిర్మాణం కోసం. యోగిజీ ఆ మార్గంలో ప్రయాణికుడు (పథిక్)’’ అని సీఎం ఆఫీస్ పేర్కొంది. ‘‘ప్రజా సేవ, ప్రజా సంక్షేమం కోసం సన్యాసి చేసే నిరంతర యజ్ఞానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారికి శిక్ష తప్పదని మరో ట్వీట్లో పేర్కొంది. వారసత్వం ద్వారా రాజకీయాలు చేసి, దేశాన్ని విస్మరించి బుజ్జగించే రాజకీయాలకు పాల్పడే వారు ప్రజా సేవ అంటే అర్థం ఎలా అర్థం చేసుకుంటారని ఆ ట్వీట్ ప్రశ్నించింది.