కెమిస్ట్రీ పేపర్ లో కచోరీ అమ్మకం... నెట్టింట ఫోటోలు వైరల్..!
వాటిని సదరు అమ్మేవ్యక్తి కెమిస్ట్రీ పేపర్ లో పెట్టి ఇవ్వడం విశేషం. ఇంకేముంది ఆ యువతి దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.
స్ట్రీట్ ఫుడ్ ని దాదాపు అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. మీరు గమనించారో లేదో...స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు... వాటిని ఏదైనా పేపర్ ప్లేట్ లేదంటే... న్యూస్ పేరర్, లేదా ఇంకేదైనా పేపర్ లో పెట్టి సర్వ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ అమ్మాయి ఓ స్ట్రీట్ ఫుడ్ ని కొనుగోలు చేయగా...వాటిని సదరు అమ్మేవ్యక్తి కెమిస్ట్రీ పేపర్ లో పెట్టి ఇవ్వడం విశేషం. ఇంకేముంది ఆ యువతి దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన కోటాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోటా రైల్వే స్టేషన్ లో అనుష్క అనే యువతి కచోరీలు కొనుగోలు చేసింది. ఆ కచోరీలు పెట్టి ఇచ్చిన పేపర్ ప్లేట్ పై కెమిస్ట్రీ రాసి ఉండటం గమనార్హం. దీంతో.. ఆమె వాటిని ఫోటోలు తీసి షేర్ చేసి... కోటా రైల్వే స్టేషన్ లో కచోరీలు తినుకుంటూ చదువుకోవచ్చుచ అంటూ.. క్యాప్షన్ జాత చేసి షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఆమె పోస్టుకి 139 వేల లైకులు రావడం గమనార్హం. ఇక ఆ పోస్టుకి వచ్చిన రియాక్షన్స్ అయితే.. వేలల్లో ఉన్నాయి. అయితే.. ఎక్కువ మంది పాజిటివ్ గా తీసుకోవడం గమనార్హం. పాత పేపర్ ని రీ సైకిల్ చేసిన విధానం బాగుందంటూ ప్రశంసిస్తున్నారు.