Asianet News TeluguAsianet News Telugu

Devas judgement: దేవాస్ తీర్పులో మోడీ సర్కార్ కు ఊర‌ట‌..

Devas judgement:  నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పును వ్య‌తిరేకిస్తూ.. దేవాస్ మల్టీమీడియా దాఖలు చేసిన అపీలును సుప్రీంకోర్టు కొట్టివేసింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో మోడీ ప్రభుత్వానికి ఊర‌ట ల‌భించింది. 
 

With Devas judgement, Modi government cleans yet another UPA mess
Author
Hyderabad, First Published Jan 18, 2022, 4:57 PM IST

Devas judgement:  నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) తీర్పుకు వ్య‌తిరేకంగా దేవాస్ మల్టీమీడియా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో మోడీ ప్రభుత్వానికి కాస్త ఊర‌ట ల‌భించింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండకపోతే చాలా నష్టం జరిగి ఉండేదని, ఈ కంపెనీని మూసివేయాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ NCLAT ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 

జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఇస్రో వాణిజ్య విభాగం, యాంట్రిక్స్, మోసం ఆరోపణలపై దేవాస్ లిక్విడేషన్ కోసం NCLTని తరలించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మోడీ ప్రభుత్వం సకాలంలో స్పందించింది. దేవాస్ మల్టీమీడియాకు లభించిన ఆర్బిట్రేషన్ అవార్డుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నెదర్లాండ్స్ కోర్టులో కేసు దాఖలు చేసింది. 

మోసం జరిగిందనే ఆరోపణలపై దేవాస్ మల్టీమీడియాను లిక్విడేషన్ చేయాలని కోరుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగం ఆంట్రిక్స్ NCLATని ఆశ్రయించే విధంగా మోదీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుంది. ఇటువంటి చర్యలు తీసుకోకపోయి ఉంటే దేవాస్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన కేసు బలహీనపడి ఉండేది. 

దేవాస్-యాంట్రిక్స్ ఒప్పందం 2005లో సంతకం చేయబడింది. అవినీతి ఆరోపణల మధ్య 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ భద్రతా నిబంధనను ఉపయోగించకుండా రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో  మోడీ స‌ర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ నేషనల్ సెక్యూరిటీ క్లాజును వినియోగించలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో భారత దేశ వాదనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన గందరగోళాన్ని సరి చేయడానికి మోదీ ప్రభుత్వం శ్రమించింది.

 చమురు ఒప్పందాలు 

యూపీఏ హయాంలో, రిటైల్ ఇంధన ధరలు ప్రపంచ క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా లేకపోవడంతో..  చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ స్థాయిలో రికవరీలు పొందాయి. ఇంధన సబ్సిడీల ద్వారా చమురు కంపెనీలకు పరిహారం చెల్లించే బదులు, ప్రభుత్వం రికవరీల కింద దీర్ఘకాలిక చమురు బాండ్‌లుగా మార్చింది. యూపీఏ ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించవలసిన సొమ్మును చెల్లించకుండా, దానికి బదులుగా రూ.1.3 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను జారీ చేసింది. ఆ ప్రభుత్వ తప్పుడు నిర్వహణ ఫలితంగా మోదీ ప్రభుత్వం సంవత్సరానికి దాదాపు రూ.10,000 కోట్ల మేరకు వడ్డీ చెల్లించాల్సి వ‌చ్చింది. అదేవిధంగా  గ‌త ప్ర‌భుత్వం పన్నుల విధానం, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ద్రవ్య లోటు పెరిగిపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. 

 
 విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ వైపు మార్పు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడిన కేంద్ర విక్రయ పన్ను (CST)లో క్రమంగా తగ్గింపుకు దారితీసింది. యుపిఎ ప్రభుత్వం, సిఎస్‌టి వసూళ్లలో కోల్పోయిన వాటాకు పరిహారంపై రాష్ట్రాలకు పదేపదే హామీ ఇచ్చినప్పటికీ హామీని నెరవేర్చడంలో విఫలమైంది. 2015లో మోడీ ప్రభుత్వం ₹33000 కోట్లను CST పరిహారంగా ఆమోదించింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించింది. GST అమలుకు మార్గం సుగమం చేసింది. గత పాలనలో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కూడా సరిగ్గా పంపిణీ చేయలేదు. 2004 నుంచి 2014 మధ్య కొన్నేళ్లుగా కేంద్రం, రాష్ట్రాల మధ్య అవిశ్వాసం ఏర్పడిన కారణంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా కంటే తక్కువగానే కేంద్రం కేటాయించిందని కాగ్ కూడా ఎత్తిచూపింది.

అధిక ఆర్థిక లోటు

అధిక ఆర్థిక లోటు మోడీ స‌ర్కార కుమరో ల్యాండ్‌మైన్‌గా మారింది. యూపీఏ  II హయాంలో సగటు ద్రవ్య లోటు జీడీపీలో 2 నుండి 5.5 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు,  గణనీయమైన రుణాలను నివారించడానికి తక్షణ‌మే  దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను చేపట్టింది మోడీ స‌ర్కార్ . 2014 నుంచి మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం విషయంలో రాజీపడకుండా, మధ్యతరగతిపై అదనపు భారం మోపకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టింది. 

రెట్రోస్పెక్టివ్ పన్ను

రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఇందులో భాగంగా ఇన్‌కమ్ టాక్స్‌ చట్టాన్ని సవరించింది.  ఈ పన్ను రద్దు చేయడంతో 17 సంస్థలకు లాభం చేకూరనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios