Asianet News TeluguAsianet News Telugu

కొత్తవాళ్లొస్తే కరెంట్, నీళ్లు బంద్: ఘజియాబాద్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నిర్ణయం

కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఘజియాబాద్ అపార్ట్ మెంట్ వాసులు కొత్త నిర్ణయం తీసుకొన్నారు. కొత్త వాళ్లను అపార్ట్ మెంట్లలోకి అనుమతివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కొత్తవారికి ఆశ్రయం ఇస్తే విద్యుత్ , వాటర్ నిలిపివేస్తామని హెచ్చరించింది.
 

Will cut water, power links of those who bring in guests: Ghaziabad society
Author
New Delhi, First Published May 11, 2020, 3:39 PM IST

ఘజియాబాద్: కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఘజియాబాద్ అపార్ట్ మెంట్ వాసులు కొత్త నిర్ణయం తీసుకొన్నారు. కొత్త వాళ్లను అపార్ట్ మెంట్లలోకి అనుమతివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కొత్తవారికి ఆశ్రయం ఇస్తే విద్యుత్ , వాటర్ నిలిపివేస్తామని హెచ్చరించింది.

కొత్తవారిని అపార్ట్ మెంట్ లోకి అనుమతిస్తే రూ. 11 వేల జరిమానాతో పాటు నీళ్లు, కరెంట్ కూడ కట్ చేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. జరిమానా చెల్లించేవరకు విద్యుత్, నీళ్ల సేవలు కూడ పునరుద్దరించబోమని హెచ్చరించింది. 

also read:సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: లాక్‌డౌన్ పై తేల్చేస్తారా?

నగరంలోని రాజ్ నగర్ ఎక్స్ టెన్షన్ లోని మూడు సోసైటీలు కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి మారాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొన్నామని అసోయేషన్ ప్రకటించింది. 

తాజా నిబంధనలపై అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహంగా ఉన్నారు. ప్లాట్స్ లో నివాసం ఉంటున్న వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొన్నారని కొందరు ఆరోపిస్తున్నారు.  జరిమానా డబ్బులను పీఎం కేర్స్ కు విరాళంగా ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios