తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తకు సమోసాలో విషం పెట్టి చంపి, మృతదేహాన్ని గడ్డివాములో దాచేసింది. ఏడాదిన్నర తరువాత అస్తిపంజరాన్ని అడవిలో పడేసింది.
మధ్యప్రదేశ్ : భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి తెగించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చింది. ఆ తరువాత భర్త మృతదేహాన్ని ఇంటిముందున్న గడ్డివాములో దాచింది. ఏడాదిన్నర పాటు గడ్డివాములోనే ఉంచిన తరువాత అస్తిపంజరాన్ని తీసుకెళ్లి అడవిలో పడేసింది. ఆ అస్తి పంజరమే ఆ మహిళను పోలీసులకు పట్టించింది. చివరకు ఆ మహిళ నిజం అంగీకరించి కటకటాల పాలయ్యింది. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రేవా జిల్లాలోని మౌగంజ్ లో నివసించే రామ్ సుశీల్ (40) పదేళ్ల క్రితం రంజన అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. నాలుగేళ్ల క్రితం సుశీల్ సోదరుడు గులాబ్ తో రంజన వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి హద్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సుశీల్.. భార్యను నిలదీశాడు. దీంతో రంజన, గులాబ్ కలిసి ఓ పథకం వేశారు. సుశీల్ ను చంపేసి అతని వాటా ఆస్తిని కూడా తామే అనుభవించాలనుకున్నారు. ఏడాదిన్నర క్రితం రామ్ సుశీల్ హత్యకు గురయ్యాడు.
పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకెళ్లి ఐదుగురి అఘాయిత్యం..
రంజన సమోసాలో ఎలకల మందు కలిపి భర్త చేత తినిపించింది. అది తిన్న కొద్దిసేపటికే సుశీల్ మృతి చెందాడు. గులాబ్ తో కలిసి సుశీల్ మృతదేహాన్ని ఇంటిముందు ఉన్న గడ్డి వాము మధ్యలో రంజన దాచింది. ఏడాదిన్నర తరువాత గడ్డివాములో అస్తిపంజరం మాత్రమే ఉండడం చూసి దానిని తీసుకువెళ్లి అడవిలో పారేశారు. కొద్ది రోజుల తరుాత అడవిలో అస్తి పంజరం గురించి పోలీసులకు సమాచారం అందింది. వారు ఆ అస్తిపంజరానికి డీఎన్ఏ టెస్ట్ చేయించారు.
అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారించడం ప్రారంభించారు. మౌగంజ్ గ్రామంలో విచారించగా సుశీల్ అనే వ్యక్తి ఏడాదిన్నర నుంచి కనిపంచడం లేదని బయటపడింది. గ్రామ ప్రజల ద్వారా రంజన, గులాబ్ వివాహేతర సంబంధం గురించి పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రంజనను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను, గులాబ్ కలిసి సుశీల్ ను చంపినట్టు ఆమె అంగీకరించింది. దీంతో వారిద్దరినీ పోలీసులు రిమాండ్ కు తరలించారు.
