Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో మళ్లీ అధికారం మాదే: కేంద్ర మంత్రి అమిత్ షా

Amit Shah: రానున్న లోక్ స‌భ ఎన్నిక‌లకు ఇప్పుడే అన్ని పార్టీలు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే  2024లో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
 

We will come back to power under the leadership of Prime Minister Modi: Union Minister Amit Shah
Author
Hyderabad, First Published Aug 9, 2022, 10:04 AM IST

Lok Sabha elections: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రధాన వ్యూహకర్తగా పరిగణించబడుతున్న షా, అదే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసం కూడా వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుండి దేశ ప్రధాని వరకు న‌రేంద్ర మోడీ ప్రయాణాన్ని వివరించే మోడీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ'  ఒడియా అనువాదంకు సంబంధించి జరిగిన ఒక కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీగా బీజేపీని తరచుగా అభివర్ణిస్తున్నప్పటికీ, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. వచ్చేసారి ఒడిశాలో కూడా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు.

30 ఏళ్ల విరామం తర్వాత, 2014లో భారత ప్రజలు నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ విజయయాత్ర కొనసాగుతోందని, నాయకుడి కృషి, అంకితభావం, నిస్వార్థ సేవ కారణంగానే బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. భారత రాజకీయాలను నాశనం చేసిన మూడు అంశాలను న‌రేంద్ర మోడీ జీ టార్గెట్ చేశారు. అవి: రాజవంశాల రాజకీయాలు, బుజ్జగింపులు, అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది అవినీతి అని షా ఏ రాజకీయ పార్టీ పేరు ప్ర‌స్తావించ‌కుండా పేర్కొన్నారు. వంశపారంపర్య రాజకీయాలు సమర్థులైన నాయకుల పనితీరును అడ్డుకుంటున్నాయని తెలిపారు. ఇక‌ బుజ్జగింపు విధానం వల్ల ప్రయోజనాలు కొన్ని నిర్దిష్ట వర్గాలకు అందుతాయయ‌ని చెప్పారు. మూడో ముఖ్య‌మైన అంశం అవినీతి వ‌ల్ల మొత్తం ప్రజలు, దేశ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని అమిత్ షా అన్నారు. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి రాకముందు దేశం రూ. 12 లక్షల కోట్ల అవినీతికి గురైందని పేర్కొన్న షా, మోడీ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు అవినీతిని చావుదెబ్బ కొట్టి, పారదర్శకతకు మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు.

మోడీ జీ రాజకీయాల్లోని అన్ని చెడు అంశాలకు ముగింపు పలికారని, అందువల్ల భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలు అంగీకరించారని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధాని సుపరిపాలనపై దృష్టి సారించి పనితీరు రాజకీయాలను నెలకొల్పార‌న్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజలకు మోడీ అవకాశం ఇచ్చారని షా అన్నారు. తన మొదటి పదవీకాలంలో, అతను దళిత నాయకుడు రామ్ నాథ్ కోవింద్ ను భారత రాష్ట్రపతిని చేసాడు. ఇప్పుడు, మారుమూల ఒడిశా గ్రామానికి చెందిన గిరిజన మహిళ, ద్రౌపది ముర్ము మహామహిమ్ (గౌరవనీయ రాష్ట్రపతి)గా ఎన్నిక‌య్యారు. వంశపారంపర్య పార్టీలు మారాల్సిన అవసరం ఉందని, లేదంటే అవి నశించిపోతాయని గ్రహించాలని షా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి ముందు, దేశం విధాన పక్షవాతానికి గురైందని, అంతర్గత భద్రత తరచుగా ప్రమాదంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు తమ ఇష్టానుసారంగా భీభత్సం సృష్టించి అమాయక ప్రజలను చంపేస్తుండగా, వారిని సవాలు చేసేందుకు ఎవరూ సాహసించలేదు. అయితే మోడీ ప్రధాని అయ్యాక దేశప్రజల విశ్వాసం మళ్లీ వచ్చింది. దేశ శత్రువులను వారి దేశంలోనే లక్ష్యంగా చేసుకుని నిర్మూలించారని అన్నారు. మోడీ తన కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోలేదని, దేశానికి 24 గంటలూ భద్రత కల్పిస్తున్న జవాన్లతోనే జరుపుకున్నారని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios