లోకాయుక్త బిల్లును తీసుకువస్తాం.. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మారుస్తాం.. : మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే
Mumbai: పూర్తి పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడుపుతామనీ మహారాష్ట్ర ముఖ్యమత్రి, శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే అన్నారు. "మహారాష్ట్రను అవినీతి రహితంగా మారుస్తాం, కాబట్టి రాష్ట్రంలో లోకాయుక్త చట్టాన్ని తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నామని" ఆయన తెలిపారు.
Maharashtra Will Introduce Lokayukta Bill: లోకాయుక్తా బిల్లును తీసుకువస్తాం.. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మారుస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే అన్నారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడుపుతామని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రను అవినీతి రహితంగా మారుస్తాం, కాబట్టి రాష్ట్రంలో లోకాయుక్త చట్టాన్ని తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త బిల్లును తీసుకురానుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. లోక్పాల్ తరహాలో మహారాష్ట్రలో లోకాయుక్తను ప్రారంభించేందుకు అన్నా హజారే కమిటీ నివేదికను ఆమోదించామని తెలిపారు. సీఎం, మంత్రివర్గాన్ని లోకాయుక్త పరిధిలోకి తీసుకొస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టాన్ని ఈ చట్టంలో భాగంగా చేయడంతోపాటు లోకాయుక్తలో రిటైర్డ్ న్యాయమూర్తులతోపాటు ఐదుగురితో కూడిన బృందం ఉంటుందని తెలిపారు.
మరోవైపు ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పారు. "మహారాష్ట్రను అవినీతి రహితంగా తీర్చిదిద్దుతాం, అందుకే రాష్ట్రంలో లోకాయుక్త చట్టం తీసుకురావాలని నిర్ణయించాం" అని తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ సంక్షోభం, పెట్టుబడి ప్రాజెక్టుల ఉపసంహరణ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతాయని మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత అజిత్ పవార్ ఆదివారం తెలిపారు
సభలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్న ప్రతిపక్షాలు...
సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాష్ట్రంలోని అనేక సమస్యలను లేవనెత్తడానికి సిద్ధమయ్యాయి. వ్యవసాయ సంక్షోభం, పెట్టుబడి ప్రాజెక్టుల నుంచి ఉపసంహరించుకుంటున్న అంశంపై సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల శాసనసభ సమావేశాల్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెడతాయని మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత అజిత్ పవార్ ఆదివారం అన్నారు. అలాగే, ఈ సాయంత్రం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నిర్వహించనున్న సాంప్రదాయ టీ పార్టీని బహిష్కరించాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా, ప్రజల అంచనాలను నెరవేర్చలేకపోయామని, అందుకే సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని, మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు అని పవార్ అన్నారు.
అలాగే, 'మహారాష్ట్ర ఏర్పడిన 62 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ జరగలేదు. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు సమస్య చాలా కాలంగా ఉన్నప్పటికీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మహారాష్ట్రలో జిల్లాల స్వాధీనం గురించి దూకుడుగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి, మా రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమైంది" అని పవార్ అన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్పై గవర్నర్ బీఎస్. కోష్యారీ వ్యాఖ్యలు, కర్ణాటకతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం వంటి ఇతర అంశాలు కూడా శీతాకాల సమావేశాల్లో హాట్ టాపిక్ అంశాలు కాన్నాయని తెలుస్తోంది.