2వేల చట్టాలను రద్దు చేశాం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్లో భారత ర్యాకును మెరుగుపర్చాము: ప్రధాని మోడీ
PM Narendra Modi: చిన్న చిన్న సమస్యలకే పారిశ్రామికవేత్తలను జైలుకు పంపాల్సిన బ్రిటిష్ కాలం నాటి వాడుకలో లేని 2 వేల చట్టాలను తమ ప్రభుత్వం రద్దు చేసిందనీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2014లో తాము అధికారం చేపట్టిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్లో భారతదేశం ర్యాంక్ గణనీయంగా మెరుగుపడిందని అన్నారు.
Gujarat: దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచే అంశాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. దేశంలో వ్యాపార వాతావరణంలో చాలా మార్పులు తీసుకువచ్చామని అన్నారు. గుజరాత్ పర్యటన సందర్బంగా ప్రధాని మోడీ పై వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న సమస్యలకే పారిశ్రామికవేత్తలను జైలుకు పంపాల్సిన బ్రిటిష్ కాలం నాటి 2,000 వాడుకలో లేని చట్టాలను తమ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. 2014లో తాను అధికారం చేపట్టిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్లో భారతదేశం ర్యాంక్ గణనీయంగా మెరుగుపడిందని ప్రధాని సోమవారం అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో వ్యాపార సౌలభ్యం కోసం ప్రపంచబ్యాంకు వార్షిక ర్యాంకింగ్లో భారత్ స్థానం ఐదేళ్లలో 142 నుంచి 63కి భారీగా ఎగబాకిందని మోడీ చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, అసెస్మెంట్ రిపోర్టులో టాప్-50 ర్యాంకింగ్స్లో భారతదేశం ఉండేలా చూడాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే, "బ్రిటీష్ (పాలన) కాలం నుండి (కాలం చెల్లిన) చట్టాలు కొనసాగాయి. దేశంలోని వ్యాపారవేత్తలు పనికిమాలిన సమస్యలపై జైలుకు వెళ్లడం నాకు ఇష్టం లేనందున నేను మొత్తం బృందాన్ని (వాటిని సమీక్షించటానికి) నియమించుకున్నాను. మేము అలాంటి 2,000 చట్టాలను రద్దు చేసాము. నేను ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది. ఇక్కడ కూర్చున్న వ్యాపారులకు అలాంటి చట్టం గురించి తెలిస్తే, నాకు తెలియజేయండి” అని ప్రధాని మోడీ అన్నారు.
దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచే అంశాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. "వ్యాపారం చేయడం సులభం అనే ప్రస్తావన లేదు... నా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో పోలిస్తే. మేము చట్టాలను-వ్యవస్థను చట్టపరంగా మార్చాము. ఇది భారతదేశ ర్యాంకింగ్ను మెరుగుపరచడంలో సహాయపడింది. నేను ప్రధానమంత్రి అయినప్పుడు (2014లో) భారతదేశం 142వ ర్యాంక్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్లో) మేము 5 నుండి 6 సంవత్సరాలు కష్టపడి 63వ స్థానానికి చేరుకున్నామని" తెలిపారు. "మనం గట్టిగా ప్రయత్నం..ఒత్తిడి చేస్తే, మేము 50 కంటే దిగువకు వెళ్తాము. అటువంటి భారీ అభివృద్ధి కేవలం కాగితాలపై మాత్రమే పరిమితం కాదు.... చిన్న వ్యాపారాలు ఇక్కడి విషయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి" అని ప్రధానమంత్రి చెప్పారు.
అలాగే, 'అర్బన్ నక్సల్స్' రూపురేఖలు మార్చుకుని గుజరాత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అయితే యువత జీవితాలను నాశనం చేసేందుకు రాష్ట్రం వారిని అనుమతించదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్లోని బరూచ్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి బల్క్ డ్రగ్స్ పార్క్కు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. "అర్బన్ నక్సల్స్ కొత్త రూపురేఖలతో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తమ వేషధారణలను మార్చుకున్నారు. వారు మన అమాయక-శక్తివంతమైన యువతను తమను అనుసరించేలా తప్పుదారి పట్టిస్తున్నారు" అని మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై పరోక్షంగా విమర్శల దాడి చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ బీజేపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేసి.. ప్రజలకు చేరువయ్యేందుకు ఆప్ నమునాతో ముందుకు సాగుతోంది. ప్రజల నుంచి కూడా ఆప్ కు మంచి స్పందన వస్తుండటంతో ఆప్ పై బీజేపీ ఎదురుదాడికి దిగింది.