హోటల్ గదిలో నిద్రిస్తున్న యువతులపై వెయిటర్ లైంగిక వేధింపులు.. ఎక్కడంటే ?
హోటల్ లో రూమ్ తీసుకొని నిద్రిస్తున్న యువతులపై అందులో పని చేసే ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
హోటల్ గదిలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళపై వెయిటర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. భోపాల్ ఎన్జీవోలో పని చేస్తున్న ఇద్దరు యువతులు తమ ఆఫీసు పని నిమిత్తం ఖాండ్వా చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్ లో రూమ్ తీసుకొని బస చేశారు. అయితే రాత్రి బెడ్ పై పడుకున్న వారి పక్కన ఆ హోటల్ లో పని చేసే వెయిట్ వచ్చి పడుకున్నాడు.
రౌడీ కపుల్.. డ్రైవర్ తో మాటలు కలిపి, మద్యం తాగించి.. కారుతో పరార్..
ఉదయం లేచి చూసే సరికి వారి పక్కన వెయిటర్ ను చూసి ఆ యువతులు ఖంగుతిన్నారు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులపై పోలీసులు అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజ్మహల్కు సమీపంలో ఆ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి: సుప్రీంకోర్టు ఆదేశం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్ లైన్ రోడ్డులో ఉన్న హోటల్ భోపాల్కు చెందిన ఇద్దరు యువతులు శనివారం రాత్రి బస చేశారు. రాత్రి ఆమె నిద్రిస్తుండగా బుర్హాన్పూర్కు చెందిన హోటల్ ఉద్యోగి బలిరామ్ (22) ఆమె మంచంపై నిద్రపోయాడు. తెల్లారి నిద్రలేచే సరికి అతడు బెడ్ పై కనిపించడంతో షాక్ అయిన యువతులు పోలీసులకు సమాచారం అందించారు.
రాజస్థాన్ లో హీటెక్కిన పొలిటికల్ వార్ .. కూల్ గా పుట్ బాల్ ఆడుతున్న రాహుల్
దీంతో కొత్వాలి పోలీసులు అక్కడికి చేరుకొని హోటల్ యజమానిని, నలుగురు ఉద్యోగులను స్టేషన్ కు పిలిపించారు. నిందితుడు తాను చేసిన తప్పును అంగీకరించాడు. దీంతో అతడిపై పోలీసులు అత్యాచార వేధింపుల కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.