రాహుల్ గాంధీ అనర్హత వేటు వేసిన విషయాన్ని జర్మనీ గమనించినట్లు చెబుతున్న నేపథ్యంలో ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు కాంగ్రెస్ "విదేశీ శక్తులను ఆహ్వానిస్తోందని" బిజెపి ఆరోపించడంతో ఈ అంశం గురువారం ఇక్కడ తాజా రాజకీయ దుమారానికి దారితీసింది. 

భారతదేశ సమగ్రతకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక క్రమపద్ధతిలో "వర్చువల్ యుద్ధం" జరుగుతుందని ఉప రాష్టప్రతి జగదీప్ ధన్‌ఖర్ గురువారం హెచ్చరించారు. నెట్‌వర్క్ 18 నిర్వహించిన 'రైజింగ్ ఇండియా సమ్మిట్'లో ఉపరాష్టప్రతి జగదీప్ ధన్‌ఖర్ ప్రసంగిస్తూ.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటమనేది పక్షపాత వైఖరి, వ్యక్తిగత ఆందోళనల ఆధారంగా జరగడం దురదృష్టకరమని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అవినీతి అంశాన్ని రాజకీయ కోణంలో ఎలా చూడగలమని అన్నారు. తమను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ అభివృద్ధి పథంలో అడ్డంకులు సృష్టించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడానికి , దేశం సాధించిన విజయాలను నాశనం చేయడానికి కొన్ని శక్తులు దేశం లోపల , వెలుపల పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

'దేశం లోపల, వెలుపల పనిచేస్తున్న ప్రపంచ యంత్రాంగాలు' చక్కటి వ్యవస్థీకృత పద్ధతిలో చేస్తున్న 'భారత సమగ్రతకు వ్యతిరేకంగా వర్చువల్ యుద్ధం' గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల కార్యకలాపాలకు తరచూ అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో గందరగోళం సాధారణమైందని అన్నారు.

డైనమిక్ ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ , న్యాయవ్యవస్థ మధ్య ఎటువంటి సమస్య ఉండదని కూడా ఆయన అన్నారు. ధంఖర్ మాట్లాడుతూ, 'సమస్యలు తప్పవు. సహకార విధానాన్ని అవలంబించడం ద్వారా వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంటులో గందరగోళం సాధారణమైందన్నారు.