ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు ప్రచారం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే వీరి ప్రచారం వల్ల ఉపయోగం దక్కలేదని అర్ధమౌతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
లక్నో: Uttara Pradesh రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓంటరిగా పోటీ చేసింది. దేశంలో అతి పెద్ద రాష్ట్రంలో Congress పార్టీ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు గాను Praiyanka Gandhi ని ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దింపింది. 2019 జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెకు బాధ్యతలను అప్పగించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అభ్యర్ధుల ఎంపికతో పాటు ప్రచారంలో కూడా ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi కూడా రాష్ట్రంలో విస్తృతంగా పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ తో పాటు ఈ దఫా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించినా కూడా కాంగ్రెస్ ఏ మాత్రం ప్రజలను తమన వైపునకు తిప్పుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయారని ఎన్నికల ఫలితాలను బట్టి చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి మాసంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి 56 రోజుల పాటు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. యోగి ఆదిత్యనాథ్, ప్రియాంక గాంధీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ 209, యోగి ఆదిత్యనాథ్ లు 203 బహిరంగ సభలు, రోడ్షోలల పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా యూపీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 1989 నుండి యూపీలో కాంగ్రెస్ పార్టీ సీఎం లేరు. అప్పటి నుండి రాష్ట్రంలో క్రమంగా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోయింది.
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. గతంలో కంటే ఈ సారి జరిగిన ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అధికార పార్టీ బీజేపీ.. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ప్రచారం సాగిస్తూ.. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశాయి. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం గత వైభవం కోసం గట్టిగానే పోరాటం సాగించాయి. ఆయా పార్టీలు భవితవ్యం మార్చి 10 తేలనుంది.
యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు సాగిందని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం తమదైన తరహాలో ప్రచారం సాగిస్తూ.. ఎన్నికల బరిలో ముందుకుసాగాయి. మొదటి విడుతలో 58 స్థానాలకు పోలింగ్ జరగగా.. ఈ సారి 60.17 శాతం పోలింగ్ నమోదైంది. 2017 ఎన్నికలతో పోలిస్తే ( 63.5 శాతం) తక్కువగా ఉంది.
ఇక యూపీ రెండో విడత ఎన్నికల్లో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 50
శాతం కంటే అధిక ముస్లిం ఓటర్లు ఈ ప్రాంతంలో ఉండటంతో అన్ని పార్టీలు ఓటర్లకు గాలంవేసేలా ముందుకు సాగాయి. 61.20 శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దశలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 623 మంది బరిలో నిలిచారు. కీలకమైన 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దశలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ , కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్, శివపాల్ యాదవ్ వంటి నేతలు పోటి పడ్డారు. అలాగే, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు నాల్గో దశలో పోలింగ్ జరిగింది.
ఇక ఫిబ్రవరి 27న ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు జరిగింది. మొత్తం 692 మంది బరిలోకి దిగగా.. వారిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా , కుంట సీటు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా , యూపీ కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నవారిలో ప్రముఖులు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తల్లి, అప్నాదళ్ నేత కృష్ణా పటేల్ అప్నాదళ్ కే తరపున పోటీలో ఉన్నారు. 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో 6వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక సోమవారం నాడు (మార్చి 7) ఏడోదశ (చివరిదశ) ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 9 జిల్లాల్లోని 54 స్థానాలకు పోలింగ్ జరిగింది. 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇక ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ అధినేత (ఎస్పీ), మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కర్కల్ నియోజవర్గం నుంచి బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ కేవలం 47 సీట్లు, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉంటుందని ఇప్పటికే ముందుస్తు అంచనాలు సైతం పేర్కొన్నాయి.
