మైనర్ బాలుడికి చిత్రహింసలు: ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి
:ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్లో 16 ఏళ్ల మతిస్థిమితం లేని బాలుడిని సమీప బంధువులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయమై ప్రశ్నించిన బాధితుడి కుటుంబసభ్యులపై కూడ నిందితులు దాడికి దిగారు. ఈ ఘటన ఈ నెల 26వ తేదీన చోటు చేసుకొంది.
లక్నో:ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్లో 16 ఏళ్ల మతిస్థిమితం లేని బాలుడిని సమీప బంధువులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయమై ప్రశ్నించిన బాధితుడి కుటుంబసభ్యులపై కూడ నిందితులు దాడికి దిగారు. ఈ ఘటన ఈ నెల 26వ తేదీన చోటు చేసుకొంది.
మతిస్థిమితం సరిగా లేని బాలుడు కొంతమంది పిల్లలతో ఆడుకొంటున్న సమయంలో బాలుడి బంధువులు అతడిని చిత్రహింసలకు గురి చేశారు. బాలుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద చిత్రహింసలకు గురి చేస్తూ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ విషయం తెలుసుకొన్న బాధితుడి కుటుంబసభ్యులు నిందితుల ఇంటి వద్దకు చేరి ఈ విషయమై ప్రశ్నించారు. బాధితుడి కుటుంబసభ్యులపై కూడ నిందితులు దాడికి దిగారు. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై వాస్తవాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రవీణ్ కుమార్ యాదవ్ చెప్పారు. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన ప్రకటించారు.