కేంద్ర మంత్రివర్గం బడ్జెట్‌ను శనివారం నాడు ఆమోదించింది. రెండోసారి వరుసగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 


న్యూఢిల్లీ: కేంద్రబడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ శనివారం నాడు ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన తర్వాత మంత్రి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన తర్వాత కేబినెట్ సమావేశానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శనివారం నాడు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం నుండి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను పార్లమెంట్‌కు చేరుకొంటారు.

Also read:రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సంబంధించిన ప్రతులు ప్రత్యేకమైన వాహనాల్లో పార్లమెంట్‌కు చేరుకొన్నాయి.ఈ బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేయనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి.