Asianet News TeluguAsianet News Telugu

9 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్..

తొమ్మిదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిమీద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. 

two minors rape nine years old girl and record video to blackmail in mathura
Author
First Published Jan 16, 2023, 10:33 AM IST

మథుర : తొమ్మిదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీసి ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించారని పోలీసులు తెలిపారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు హైవే పోలీస్‌ స్టేషన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఛోటే లాల్‌ తెలిపారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండడం చూసిన ఇరుగుపొరుగున ఉండే అబ్బాయిలు.. బాలిక ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె నిరసన తెలపడంతో వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతోపాటు.. నిందితుడు ఈ ఘటనను వీడియో తీశారు. అత్యాచారం విషయం బాధితురాలు ఎవరికైనా చెబితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఢిల్లీలో షాకింగ్.. వ్యక్తిని చంపి,శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి..వీడియో తీసి, పాకిస్థాన్ కు...

ఇదిలా ఉండగా, వావివరుసలు మరిచిపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడు అన్నెం పున్నెం తెలియని కూతురిని కాటేశాడు. మూడేళ్ల పాటు కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు. ఆ సంఘటన శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో వెలుగు చూసింది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మాచవరానికి చెందిన వ్యక్తి ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నాడు.

అతనికి ఇద్దరు కూతుళ్లు. అతని భార్య ఓసారి భర్త, పెద్ద కూతురి నగ్న చిత్రాలను చూసింది. దాని గురించి భర్తను ప్రశ్నించింది. అవి నిజమైన ఫొటోలు కావని అతను బుకాయించాడు. దాంతో ఆమె మిన్నకుండిపోయింది. ఆ తర్వాత అతను ఆ ఫొటోలను తీసేశాడు. 

భర్త ప్రవర్తన సరిగా లేదని గ్రహించిన అతని భార్య ఇద్దరు కూతుళ్లను కూడా 2022 జులై నుంచి గన్నవరంలోని ఓ హాస్టల్లో చేర్చి చదివిస్తోంది. సెలవులు కావడంతో ఈ నెల 7వ తేదీన కూతుళ్లు ఇంటికి వచ్చారు. అయితే, పెద్ద కూతురు తండ్రికి దూరంగా ఉండసాగింది. దానికి ఆగ్రహించిన అతను ఆమెను బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యను తిట్టాడు. తర్వాత కూతుళ్లు హాస్టల్ కు వెళ్లిపోయారు.

ఇద్దరు కూతుళ్లు కూడా తిరిగి 10వ తేదీన ఇంటికి వచ్చారు. ఆ రోజు సాయంత్యరం తండ్రి పెద్ద కూతురిని బ్యాంక్ పని ఉందని చెప్పి టూవీలర్ మీద తీసుకుని వెళ్లాడు. తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద కూతురు తల్లి వద్దకు వెళ్లి తండ్రి తనపై చేసిన దురాగతం గురించి చెప్పింది.  బ్యాంక్ కని చెప్పి తీసుకుని వెళ్లి రామవరప్పాడు పైవంతెన దగ్గరలో గల నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. 

తాను ప్రతిఘటించడంతో ముళ్ల కర్రతో కొట్టాడని కూడా చెప్పింది. తనపై తండ్రి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని కూతురు తల్లితో చెప్పింది. తల్లి, కూతురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పదమూడేళ్ల బాలిక తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios