Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్‌ లూథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు.. ఇద్ద‌రు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

పంజాబ్ లోని లూథియానా కోర్టు కాంప్లెక్స్ లో పేలుడు సంభవించిది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే  చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

Two killed, five injured in blast at Ludhiana court complex in Punjab
Author
Punjab, First Published Dec 23, 2021, 1:44 PM IST

PUNJAB LUTHIYANA BLAST : పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టులో గురువారం మ‌ధ్యాహ్నం పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందారు. దీంతో రాష్ట్రం మొత్తం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఎప్ప‌టిలాగే కోర్టులో కార్యక‌లాపాలు సాగుతున్న స‌మ‌యంలో ఈ పేలుడు సంభ‌వించ‌డంతో అంద‌రూ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కోర్టు కాంప్లెక్స్ లోని రెండో అంత‌స్థులో ఈ బ్లాస్ట్ జ‌రిగింది. దీంతో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా మ‌రో ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. పేలుడు సంభ‌వించిన అనంత‌రం ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఫైర్ ఇంజ‌న్ లు కూడా అక్క‌డికి చేరుకున్నాయి.  ‘లూథియానా కోర్టు కాంప్లెక్స్‌లో జ‌రిగిన బాస్ట్‌లో ఇద్ద‌రు మృతి చెందారు. వారి  మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నాం’ అని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం కూడా ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ లో పేలుడు సంభ‌వించింది. కోర్టు ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. ల్యాప్ టాప్ బ్యాట‌రీ పేలి  ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని మొద‌ట‌గా పోలీసులు భావించారు. కానీ విచార‌ణ త‌రువాత ఈ పేలుడుకు కార‌ణ‌మైన వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఆ ఘ‌న‌టలో డీఆర్ డీవో శాస్త్ర‌వేత్త ప్ర‌ధాన నింధితుడిగా ఉన్నాడు. 

అఖిలేష్ యాదవ్ ఇంట్లో కరోనా కలకలం.. ఫోన్ చేసి మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్

 

Follow Us:
Download App:
  • android
  • ios