Asianet News TeluguAsianet News Telugu

ద్వేషపూరిత ప్రసారాలపై సుప్రీంకోర్టు ఫైర్..

ద్వేషపూరిత ప్రసంగాల కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం టెలివిజన్ ఛానెళ్లను మందలించింది. టెలివిజన్ ఛానళ్లు సమాజంలో చీలికలు సృష్టిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. టీవీ ఛానళ్లు విభజనను సృష్టించే ఎజెండాల ద్వారా నడపబడుతున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

TV channels are creating divisions, being dictated by those who fund them, says Supreme Court
Author
First Published Feb 3, 2023, 3:53 AM IST

ద్వేషపూరిత ప్రసంగాల కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం టెలివిజన్ ఛానెళ్లను మందలించింది. టెలివిజన్ ఛానళ్లు సమాజంలో చీలికలు సృష్టిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని టీవీ ఛానళ్లు ఆ ఎజెండాతో నడిచేవని, ఇవి విభజనను సృష్టిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.సంచలన వార్తల కోసం టీవీ ఛానళ్లు పోటీ పడతాయని, వాటి ఫైనాన్షియర్ల (యజమానుల) ఆదేశాల మేరకు పనిచేస్తాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన పిటిషన్లను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారించింది.

 
బాధ్యులైన సంస్థలను ప్రశ్నించిన కోర్టు
 
ఇలాంటి ప్రసారాలను ఎలా నియంత్రిస్తారని జస్టిస్‌లు కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీఎస్‌ఏ), కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'చానల్స్ ప్రధానంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని విషయాలను సంచలనం చేస్తారు. మీరు (ప్రభుత్వం, NBSA) దానిని ఎలా నియంత్రిస్తారు? భాష, భావప్రకటనా స్వేచ్ఛ ముఖ్యం. దీని ద్వారా కార్య క్రమం నిర్వ హిస్తున్న ట్లు తెలిపారు. డబ్బు ఎవరు పెట్టుబడి పెట్టాలనేది కూడా వారే నిర్ణయిస్తారని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు, 
  
న్యూస్ యాంకర్లపై కఠిన చర్యలు 

ఇలాంటి ఛానెల్స్ సమాజంలో విభజనను సృష్టిస్తున్నాయని జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం పేర్కొంది.'మీరు వాక్ స్వాతంత్ర్యం ,భావ ప్రకటనా స్వేచ్ఛను క్లెయిమ్ చేసినప్పుడు, మీరు అర్హులైనది చేయాలి' అని వ్యాఖ్యానించారు. దీనితో పాటు..ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించే వార్తా యాంకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. యాంకర్లకు జరిమానా విధిస్తే.. తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సుప్రీమ్ కోర్టు పేర్కొంది.

అదే సమయంలో, ద్వేషపూరిత ప్రసంగాలను ఎదుర్కోవటానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి)కి సమగ్ర సవరణలు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పందించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కేఎం నటరాజ్ మాట్లాడుతూ.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో సవరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios