Asianet News TeluguAsianet News Telugu

పెళ్లాం ఊరెళితే.. ట్రాన్స్ జెండర్ ని ఇంటికి ఆహ్వానించి, హత్య చేసి..సగం పెట్టెలో పెట్టి...

ఓ ట్రాన్స్ జెండర్ ను అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. ఆ తరువాత సగం మృతదేహాన్ని బ్యాగులో పెట్టి పొదల్లో గిరాటేశాడు. మరో సగాన్ని ఇంట్లో పెట్టెలో దాచి పెట్టాడు. 

Transgender Mutilated Body Found In bushes A Piece Was Found At Accused Home In Indore
Author
First Published Sep 1, 2022, 12:14 PM IST

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో దారుణ ఘటన జరిగింది. పోలీసులకు అక్కడి పొదలమాటున చిధ్రమైన ట్రాన్స్జెండర్ మృతదేహం లభించింది. సగం మాత్రమే ఉన్న మృతదేహాన్ని చూసి వారు షాక్ కు గురయ్యారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో వారికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… పోలీసులు గుర్తించిన ఆ ట్రాన్స్జెండర్ మృతదేహంలో ఒక భాగం మాత్రమే వీరికి లభించింది. దీంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీని పరిశీలించారు. చనిపోయిన ట్రాన్స్జెండర్ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్ జోయా కిన్నార్ గా గుర్తించారు.

అయితే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్ మొహమ్మద్ గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతని విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విచారణలో తెలిసిన విషయాలు ఏంటంటే.. నిందితుడుకి వివాహం అయ్యింది.  అతని భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆ సమయంలో నిందితుడికి సోషల్ మీడియాలో  జోయా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అయితే ఆమె ట్రాన్స్జెండర్. ఈ విషయం అతనికి తెలియలేదు. దీంతో ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత తన భార్య ఇంట్లో లేదని.. జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు నిందితుడు. 

భార్యమీద అలిగి తాటిచెట్టెక్కాడు.. నెలరోజులుగా, తిండి,నిద్ర.. మకాం అక్కడే.. ఎక్కడంటే...

అయితే, ఇంటికి వచ్చాక కానీ, జోయా ట్రాన్స్జెండర్ అని తెలియలేదు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని నిందితుడు తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతు కోసి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు అతను తెలిపాడు. మరో భాగాన్ని పారేయ లేక తన ఇంట్లోనే పెట్టెలో భద్రపరిచినట్లు తెలిపారు. దీంతో పోలీసులు మిగతా సగభాగం మృతదేహాన్ని నిందితుడు నూర్ మొహమ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios