Asianet News TeluguAsianet News Telugu

రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్

బస్సుల్లోనే కాదు రైలులో కూడ సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Train Compartment Turns Into Battleground As Woman Threatens To Hit Passenger Over Seat Dispute  lns
Author
First Published Mar 11, 2024, 10:34 AM IST


న్యూఢిల్లీ: రైలులో  సీటు కోసం  ఇద్దరు మహిళలు ఓ వ్యక్తితో గొడవపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  రైలులో  చుట్టూ ప్రయాణీకులు వీరి గొడవను ఆసక్తిగా గమనిస్తున్నట్టుగా వీడియోలో దృశ్యాలున్నాయి.  ఓ మహిళ పురుషుడి కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీస్తున్నట్టుగా వీడియోలో  ఉంది.  

also read:యూపీ సీఎం యోగి ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్: కేసు నమోదు

డెహ్ర- గోరఖ్ పూర్ రైలులో  ఈ ఘటన చోటు చేసుకుంది.  అర్హంత్ షెల్బీ అనే నెటిజన్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. మహిళా దినోత్సవం రోజున సీట్ల సమస్యపై మహిళల  ఆందోళన పేరుతో  మరో వ్యక్తి కూడ ఈ వీడియోను పోస్టు చేశారు.

also read:అరుదైన గౌరవం:స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హైద్రాబాద్ మెట్రో రైలు విజయగాధ

 ఈ వీడియో పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే వేలాది మంది తిలకించారు. 4 లక్షల మంది ఈ వీడియోను చూశారు. మరో వైపు 2 వేల మంది ఈ వీడియోకు లైక్ కొట్టారు.

also read:వాయు కాలుష్యానికి ఆత్మహత్యలకు లింక్: రిపోర్ట్

 

ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  కొందరు తమ వ్యాఖ్యల్లో హ్యాపీ ఉమెన్స్ డే లేడీస్ వంటి కామెంట్స్ చేశారు.  మరికొందరు ఈ ఘటనను మహిళా సాధికారితకు  ప్రతిబింబంగా పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios