Asianet News TeluguAsianet News Telugu

TIMES NOW - ETG Exit poll : ఏన్డీయేకు ప‌ట్టం.. కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష పాత్ర‌కే పరిమితం.. !

TIMES NOW - ETG Exit poll : దేశంలో జ‌రిగిన ఏడు ద‌శ‌ల ఓటింగ్ ముగియ‌డంతో ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి కేంద్రంలో ఏన్డీయే కూట‌మి మెజారిటీ స్థానాలు కైవ‌సం చేసుకుంటుంద‌ని టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్ అంచ‌నా వేసింది.
 

Times NOW - ETG Exit poll: Modi govt at Centre once again Congress's opposition status RMA
Author
First Published Jun 1, 2024, 11:02 PM IST | Last Updated Jun 1, 2024, 11:02 PM IST

TIMES NOW - ETG Exit poll 2024 Result : సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ శ‌నివారంతో ముగిసింది. మొత్తం ఏడు ద‌శ‌ల్లో కొన‌సాగిన ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే  ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రావడం మొదలయ్యాయి. లోక్‌సభలోని 543 స్థానాల్లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు 272 సీట్లు కావాలి.  2024 లోక్ స‌భ ఎన్నికల చివరి దశ పోలింగ్ నేటితో (జూన్ 1) ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన అంచ‌నాలు మ‌రోసారి మోడీ స‌ర్కారుకే ప‌ట్టంక‌ట్టాయి.

టైమ్స్ నౌ-ఈటీజీ కూడా మ‌రోసారి బీజేపీ ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొంది. టైమ్స్ నౌ-ఈటీజీ నిర్వ‌హించిన అంచ‌నాల ప్ర‌కారం.. ఎన్డీయే కూట‌మి 358 స్థానాలు, ఇండియా కూట‌మి 132 స్థానాలు గెలుచుకుంటుంద‌ని పేర్కొంది. ఇత‌రులు 132 స్థానాలు గెలుచుకుంటుంద‌ని తెలిపింది. ముచ్చ‌ట‌గా మూడో సారి కేంద్రంలో మోడీ స‌ర్కారు అధికారంలోకి కూర్చుంటుంద‌ని తెలిపింది. 

వివిధ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ గ‌మ‌నిస్తే.. 

తెలంగాణలో బీజేపీకి 9 సీట్లు, కాంగ్రెస్‌కు 6-7, బీఆర్ఏ 0, ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎంకు సీట్లు వస్తాయని అంచ‌నా వేసింది. కర్ణాటకలో 21-22 సీట్లు ఎన్డీయేకు,  కాంగ్రెస్‌కు నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని పేర్కొంది. జేడీయూ ఒకటి నుంచి రెండు సీట్లు సాధిస్తుంద‌ని అంచ‌నా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, అందులో బీజేపీకి 2, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 13-15, టీడీపీకి 7-9, జేఎస్‌పీకి 1, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాద‌ని పేర్కొంది. తమిళనాడులో డీఎంకేకు 34-35 సీట్లు, ఎన్డీయేకు 2-3 సీట్లు, ఏఐఏడీఎంకేకు 2 సీట్లు వస్తాయని తెలుస్తోంది. డీఎంకేకు 52 శాతం, ఎన్డీయేకు 15 శాతం, ఏఐఏడీఎంకేకు 25 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు అంచ‌నా వేసింది.

కేరళలో యూడీఎఫ్‌కు 14 నుంచి 15 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది. కేరళలో ఎన్డీయే కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఎల్‌డీఎఫ్‌కు 4 సీట్లు వచ్చాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకారం గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోంది. చండీగఢ్‌లో కూడా బీజేపీ విజయం సాధిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలు బీజేపీ ఖాతాలో చేరవచ్చు. కాంగ్రెస్ ఇక్కడ నుంచి ఖాతా తెరవడం లేదు. ఇక్కడ బీజేపీ చాలా బలమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం నాలుగు సీట్లలో బీజేపీకి మూడు నుంచి నాలుగు సీట్లు వస్తాయని తెలుస్తోంది.

Republic Bharat-MATRIZE Exit Poll: రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్.. గెలుపెవ‌రిది అంటే..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios