Delhi: ముగ్గురు మైనర్ బాలికల కిడ్నాప్.. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి.. దారుణం
Delhi: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ముగ్గురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ మేరకు గురువారం పోలీసులు సమాచారం అందించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Delhi: చిన్నారులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను అమలు చేస్తున్న.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం.. పసికందుల నుంచి పండు ముసలి వాళ్ల దాకా లైంగిక దాడులకు బలవుతున్నారు. నిర్భయ, దిశ లాంటి ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నా.. మృగాళ్ల ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. నిత్యం ఏదొక చోట అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా దేశ రాజధానిలో ముగ్గురు మైనర్లపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ముగ్గురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జూలై 6న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గురువారం పోలీసులు సమాచారం అందించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ సీరియస్ అయ్యారు. ఆగస్టు 14లోగా నిందితుడిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిందితుడి వివరాలు, అతడి గాలింపు కోసం ఎలాంటి చర్యలు తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ముగ్గురు బాలికలు ముంబై వెళ్లాలని ప్లాన్ చేసి ఆగస్టు 6న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని ఒక అపరిచితుడు కలిసి రైల్వే టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఓ యువకుడు రోహిణిలోని అతని గదికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆ ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
అనంతరం నిందితుడు ముగ్గురు మైనర్లలకు మత్తుమందు కలిపి కూల్డ్రింక్స్ ఇచ్చాడు. దీంతో బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ముంబయి వెళ్లాలని తమను పంపమని బాలికలు నిందితుడ్ని కోరగా.. ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని ఆ కామాంధుడు బాలికలతో చెప్పాడు. ఎలాగోలా ఆ నిందితుడి నుంచి తప్పించుకుని బాలికలు తమ ఇంటికి చేరుకున్నారు. వారిపై జరిగిన అత్యాచారం గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో కుటుంబ సభ్యులు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) బెనిటా మేరీ జాకర్ మాట్లాడుతూ, ఫిర్యాదుదారుడి కుమార్తెతో పాటు పాఠశాలకు చెందిన మరో ఇద్దరు బాలికలు కూడా కనిపించడం లేదని పోలీసులు కనుగొన్నారు. విచారణ సమయంలో తప్పిపోయిన బాలికల తల్లిదండ్రులు, సహవిద్యార్థులను ప్రశ్నించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంతలో కరోల్ బాగ్ ప్రాంతంలో అతని కదలిక గురించి సమాచారం అందింది, అక్కడ నుండి అతన్ని గుర్తించి వైద్య పరీక్షలు చేశారు. అన్ని ప్రాసిక్యూటర్లు సెక్స్ చరిత్రను అందించారు ’’ అని డీసీపీ చెప్పినట్లు పేర్కొంది. కరోల్ బాగ్ నుండి రక్షించబడిన తర్వాత, ఒక నిందితుడు తమను రోహిణిలోని ఒక ఇంటికి తీసుకెళ్లి అక్కడ బందీలుగా ఉంచి అత్యాచారం చేశాడని బాలికలు చెప్పారు. అయితే వారు తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు.
బెంగాలీ లాల్ శర్మ (45), సందీప్ (36), రుక్సానా (40), జ్యోతి (19)లను అదుపులోకి తీసుకున్న పోలీసు బృందాన్ని ఇంటికి పంపినట్లు డీసీపీ తెలిపారు. అయితే ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన ప్రకాష్ పరారీలో ఉన్నాడని అధికారి తెలిపారు. విచారణలో శర్మ రుక్సానాతో కలిసి మానవ అక్రమ రవాణా సిండికేట్ను నడుపుతున్నట్లు చెప్పాడు. చండీగఢ్లో అమ్మాయిలను విక్రయించాలనుకున్నారని డీసీపీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులపై సెక్షన్ల కింద కేసునమోదు చేశారనీ, రుక్సానా, జ్యోతిలను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపామని, శర్మ, సందీప్లను విచారిస్తున్నామని డీసీపీ తెలిపారు. ఈ ఘటనను అత్యంత తీవ్రమైన అంశంగా అభివర్ణించిన DCW, ఎఫ్ఐఆర్ కాపీని, ఇతర వివరాలతో సహా నిందితుల వివరాలను కోరుతూ పోలీసులకు నోటీసు పంపింది.