Dispur: తాజాగా ఎన్నికలు జరిగిన మూడు ఈశాన్య భారత రాష్ట్రాల్లో సంపూర్ణ అధిక్యంతో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో హంగ్ అసెంబ్లీలు ఉండవనీ, బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అసోం సీఎం పేర్కొన్నారు.
Assam Chief Minister Himanta Biswa Sarma: ఇటీవల ఎన్నికలు జరిగిన ఈశాన్య భారత రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ లేదా తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ అయన శర్మ పేర్కొన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో హంగ్ అసెంబ్లీలు ఉండవనీ, బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అసోం సీఎం పేర్కొన్నారు.
"హంగ్ అసెంబ్లీ ఉండదు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది" అని మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ హిమంత బిస్వా శర్మ అన్నారు. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల గురించి అడిగినప్పుడు, త్రిపుర, నాగాలాండ్ లలో మార్పు ఉండదని ఆయన చెప్పారు. త్రిపురలో బీజేపీ ముఖ్యమంత్రి, నాగాలాండ్ లో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. బీజేపీ గెలిచిన నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా మేఘాలయ సీఎంను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి.
2023లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతలో సీట్ల కోసం పలు పార్టీలు పోటీ పడుతుండటంతో క్లిష్టమైన రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ఈ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు వాగ్దానాలు, ప్రత్యర్థులపై దాడులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జోరుగా ప్రచారం నిర్వహించాయి. రెండు రాష్ట్రాల్లోని 60 స్థానాలకు గాను 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. నాగాలాండ్ లో అకులుటో నుంచి బీజేపీ అభ్యర్థి కజేటో కినిమి ఏకగ్రీవంగా విజయం సాధించగా, మేఘాలయలోని సోహియాంగ్ కు మాజీ మంత్రి, యూడీపీ అభ్యర్థి హెచ్డీఆర్ లింగ్డో మరణంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
మేఘాలయలో బీజేపీ, కాంగ్రెస్, సీఎం కాన్రాడ్ సంగ్మాకు చెందిన ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ), తృణమూల్ కాంగ్రెస్ లు ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశాన్ని అన్ని పార్టీలు ప్రధానంగా ప్రస్తావించాయి. అవినీతి ఆరోపణలతో చిరకాల మిత్రపక్షమైన ఎన్పీపీతో విభేదాలు తలెత్తిన బీజేపీ ఈసారి మేఘాలయలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. కాగా, నాగాలాండ్ లో అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్ డీపీపీ) ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, ఎన్డీపీపీ 20:40 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.
