Asianet News TeluguAsianet News Telugu

యువతిని కిడ్నాప్ చేసి, వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి.. రెండు వారాలపాటు అత్యాచారం..

19యేళ్ల యువతిని 18,20యేళ్ల యువకులిద్దరు కిడ్నాప్ చేసి.. రెండు వారాలపాటు అత్యాచారం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. 

The young woman was kidnapped, Raped for two weeks In uttar pradesh
Author
First Published Dec 13, 2022, 7:36 AM IST

ఉత్తర ప్రదేశ్ : అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అమ్మాయిలను కిడ్నాప్ చేయడం, వారిమీద  లైంగిక వేధింపులకు పాల్పడడం నిత్య కృత్యం అయిపోయింది.  అలాంటి ఓ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బల్లియాలో వెలుగు చూసింది. గర్హ్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 19యేళ్ల యువతి కిడ్నాప్ కు గురయ్యింది. ఇద్దరు యువకులు  ఆ యువతిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తీసుకువెళ్లారు. రెండు వారాల పాటు ఆ యువతి మీద అత్యాచారం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

నిందితులిద్దరూ 18, 20 యేళ్ల వయస్సు వారే కావడం గమనార్హం. బింద్, కుమార్ అనే ఇద్దరు యువకులు నవంబర్ 11వ తేదీన సదరు యువతిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని గర్హ్వార్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. నవంబర్ 20న యువతి కనిపించడం లేదంటూ ఆమె  సోదరుడు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఆరురోజుల్లో వారు ఆమె ఆచూకీ కనిపెట్టారు. నవంబర్ 26న బీహార్లో యువతి ఉన్నట్లు వారికి తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఓ హోటల్ గదిలో ఉన్న ఆమెను రక్షించి, నిందితులను అరెస్టు చేశారు.

ముగ్గురు కోచింగ్ సెంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌.. పోలీసులు ఏం చెప్పారంటే..?

విచారణలో యువతి చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు.  నిందితులను ఆదివారం అరెస్టు చూపించి కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో యువతి వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువకులు ఇద్దరూ తనకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత కిడ్నాప్ చేశారని  ఆరోపించింది. ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి బీహార్ లోని ఓ హోటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ 15 రోజుల పాటు ఓ గదిలో బంధించి తనపై అత్యాచారం చేశారని యువతి తెలిపింది. ఈ మేరకు కోర్టు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ వివరాలను ఓ అధికారి మీడియాకు వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios