PM Modi-ISB: 2014 తర్వాత భారతదేశం రాజకీయ సంకల్ప బలం మరియు సంస్కరణలను చూస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఐఎస్బీ-హైదరాబాద్ వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా పీఎం మాట్లాడుతూ యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని అన్నారు.
Prime Minister Narendra Modi: "యావత్ ప్రపంచాన్ని మన యువత నడిపించగలరని నిరూపిస్తున్నారు. అందుకే నేడు ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది... భారత యువత, ఆవిష్కరణలు, ఉత్పత్తి వైపు సరికొత్త గౌరవం, విశ్వాసంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి" అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎంతో ముఖ్యమైన ఈ రోజున మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో కలపమని నేను మిమ్మల్ని కోరాలనుకుంటున్నానని ప్రధాని అన్నారు. గత 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరత కారణంగా దేశం రాజకీయ సంకల్పం లోపించిందని తెలిపారు. అయితే, 2014 తర్వాత భారతదేశం రాజకీయ సంకల్ప బలం మరియు సంస్కరణలను చూస్తోందని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామనీ, ఎంతో ప్రగతిని సాధించిదని తెలిపారు. దీని కారణంగా 8 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీల సంఖ్య 380 నుంచి 600కి పైగా పెరిగిందని తెలిపారు. దేశంలో మెడికల్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 90 వేల నుండి 1.5 లక్షలకు పెరిగాయని అన్నారు. గత 8 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద స్ఫూర్తి ప్రజల భాగస్వామ్యంతో వచ్చిందని తెలిపారు. దేశ ప్రజలు తమను తాము ముందుకు తీసుకెళ్తూ సంస్కరణలకు ఊపునిస్తున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్లోనూ దీనిని స్పష్టంగా చూశాము అని పేర్కొన్నారు. వాక్ ఫర్ లోకల్ అండ్ సెల్ఫ్-రిలెంట్ ఇండియా క్యాంపెయిన్లో ప్రజల భాగస్వామ్య శక్తిని ఇప్పుడు మనం చూస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు.
ఇదిలా ఉండగా, దేశానికి ఐఎస్బీ అందిస్తున్న సహకారాన్ని అభినందించిన ప్రధాని మోడీ.. “ఈ రోజు భారతదేశం జీ20 దేశాల సమూహంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. స్మార్ట్ఫోన్ డేటా వినియోగం విషయంలో, భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మనం ఈ సంఖ్యను పరిశీలిస్తే. ఇంటర్నెట్ వినియోగదారుల్లో అప్పుడు భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్లో కూడా భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ భారతదేశంలో ఉంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ భారతదేశంలో ఉంది" అని అన్నారు.
అంతకు ముందు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. తెలంగాణను కుటుంబ పాలన, బుజ్జగింపుల నుంచి విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. వంశపారంపర్య రాజకీయాలు, కుటుంబ కేంద్రీకృత పార్టీలు ప్రజాస్వామ్యానికి, దేశ యువతకు అతిపెద్ద శత్రువులని ప్రధాని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సత్వర అభివృద్ధికి ద్వారాలు తెరుస్తానని, కుటుంబకేంద్రీకృత పార్టీల పాలనను అంతమొందించేందుకు తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మార్పు ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 2013లో హైదరాబాద్ చరిత్రను లిఖించిందని, తెలంగాణ ప్రజలు బహిరంగ సభకు హాజరయ్యేందుకు, తన మాట వినేందుకు టిక్కెట్లు కొనుక్కుని యావత్ భారతదేశం ఆలోచనలను మార్చేశారని గుర్తు చేశారు. దేశ ప్రజలకు సేవ చేయడంలో ఇదొక మలుపు అని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ ప్రజలు మళ్లీ చరిత్ర సృష్టిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
