ఢిల్లీకి చెందిన ఓ చిరు వ్యాపారి టమాటాలు కొనలేక ఓ బోరున విలపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ లో షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

దేశంలోని అనేక ప్రాంతాల్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు చిరు వ్యాపారాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. అనేక మంది చిరు వ్యాపారులు తెల్లవారుజామున హోల్ సేల్ మార్కెట్ లో కూరగాయలు కొని, వాటిని రిటైల్ గా మార్కెట్ లో కూర్చొని విక్రయిస్తారు. అయితే పెరిగిన ధరల వల్ల ఈ చిరు వ్యాపారులు టమాలను కొనలేకపోతున్నారు. 

కుల్గాంలో సైనికుడి కిడ్నాప్..? ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన ఆర్మీ, పోలీసులు

ఢిల్లీకి చెందిన రామేశ్వర్ కూడా ఇలాంటి చిరు వ్యాపారి. ప్రతీ రోెజు హోల్ సేల్ లో కూరగాయలు కొని ఆజాద్ పూర్ మార్కెట్ లో విక్రయిస్తుంటాడు. ఆయన కూడా ఈ పెరిగిన ధరల వల్ల టమాటాలు కొనలేకపోతున్నారు. దీంతో తాను వ్యాపారం సాగించలేకపోతున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

జహంగీర్ పురిలో నివసించే రామేశ్వర్ తన కుమారుడితో కలిసి మార్కెట్ వచ్చారు. ఆ సమయంలో ఆయనను హిందీ మీడియా ‘లల్లాంటాప్’ పెరిగిన కూరగాయల ధరలపై ప్రశ్నించింది. దీంతో ఆయన సమాధానమిస్తూ.. ‘‘టమోటాలు చాలా ఖరీదైనవి. కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బుల్లేవు’’ అంటూ చెబుతుండగానే అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘‘మేము వాటిని ఏ ధరకు విక్రయించగలమో కూడా మాకు తెలియదు. ఒక వేళ టమాటాలు వర్షంలో తడిసినా.. స్టాక్ కు ఏదైనా జరిగిన తీవ్రంగా నష్టపోతాం’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

దారుణం.. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం.. వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్..

ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయని ఆయన మీడియాతో తెలిపారు. ప్రతిదీ ఖరీదైనదిగా మారుతోందని అన్నారు. ద్రవ్యోల్బణం తనను నిరాశాజనక పరిస్థితిలోకి నెట్టిందని, రోజుకు రూ .100-200 కూడా సంపాదించలేనని వ్యాపారి చెప్పారు. కాగా.. ఈ వీడియో ఆన్ లైన్ తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం దేశంలో ప్రతీ సాధారణ పౌరుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

కాగా.. ఈ వీడియోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. పాలకులు దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు అధికారాన్ని కాపాడుతున్న శక్తిమంతమైన వ్యక్తులు ఉన్నారని, వారి సూచనల మేరకు దేశ విధానాలను రూపొందిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కూరగాయలు వంటి ప్రాథమిక వస్తువులు కూడా దూరమవుతున్నామవుతున్న సామాన్య భారతీయుడు ఉన్నాడని అన్నారు. ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూడ్చి, ఈ కన్నీళ్లను తుడచాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

7 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ-సీ56ను నింగిలోకి పంపిన ఇస్రో

ఈ వీడియో నటుడు విజయ్ వర్మ స్పందించారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కష్టాల్లో ఉన్న ఈ కూరగాయల వ్యాపారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అతడిలాంటి చిన్న వ్యాపారులకు సాయం చేస్తానని పేర్కొన్నారు.