సారాంశం
సెలవులపై ఇంటికి వచ్చిన సైనికుడు కిడ్నాప్ గురయ్యారు. లడఖ్ లో నిర్వహిస్తున్న జవాన్.. సెలవులపై కుల్గాంలో ఉన్న ఇంటికి వెళ్లారు. వ్యక్తిగత పనుల కోసం తన కారులో బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు.
జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో సెలవుపై ఇంటికి వచ్చిన 25 ఏళ్ల సైనికుడి కిడ్నాప్ అయినట్టు తెలుస్తోంది. అతడిని వాహనం నుంచి కిడ్నాప్ చేశారని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇండియన్ ఆర్మీ, పోలీసులు సైనికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తప్పిపోయిన ఆర్మీ జవాన్ పేరు జావేద్ అహ్మద్ వనీ. కుల్గాం జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన ఆయన.. లేహ్ (లడఖ్)లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సెలవులపై ఇంటికి వచ్చారు. అయితే జావేద్ శనివారం కిరాణా సరుకులు కొనేందుకు ఇంటి నుంచి కారులో చౌల్గాంకు వెళ్లారు.
అయితే సాయంత్రం కారులో నుంచి కనిపించకుండా పోయారు. జావేద్ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పరాన్హాల్ గ్రామంలో జావేద్ కారు కనిపించింది. అతడి కారులో ఒక జత చెప్పులు, రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ లో విషాదం.. నిద్రిస్తున్న బాలుడిపై పడి కాటేసిన పాములు.. చికిత్స పొందుతూ మృతి..
పోలీసులు పరాన్హాల్ గ్రామానికి చేరుకున్నారు. వాహాన్ని అన్ లాక్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆర్మీ అధికారులకు దీనిపై సమాచారం అందించారు. దీంతో ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. పోలీసులు, ఆర్మీ కలిసి సైనికుడి కోసం గాలిస్తున్నారు.