Asianet News TeluguAsianet News Telugu

త‌ల్లి మృత‌దేహాన్ని ప్లాస్టిక్ డ్ర‌మ్ లో పెట్టి.. సిమెంట్ తో క‌ప్పేసిన కుమారుడు..

తమిళనాడులోని చైన్పైలో ఘోరం జరిగింది. ఓ కుమారుడు తన తల్లి మృత‌దేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి, సిమెంట్ పోశాడు. కొంత కాలం తరువాత పెద్ద కుమారుడు వచ్చి తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

The mother put the body in a plastic drum.. The son covered it with cement..
Author
Chennai, First Published May 18, 2022, 11:43 AM IST

ఆమెకు ముగ్గురు కుమారులు.. భ‌ర్త గ‌తంలోనే చ‌నిపోయారు. ఇద్ద‌రు పెద్ద కుమారులు త‌ల్లికి దూరంగా వారి భార్యా పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటున్నారు. చిన్న కుమారుడు మాత్ర‌మే ఆమెతో ఉంటున్నాడు. అయితే అత‌డికి మాన‌సిక ప‌రిప‌క్వ‌త స‌రిగా లేక‌పోవ‌డంతో భార్యా పిల్ల‌ల‌కు కూడా దూరంగా వెళ్లిపోయారు. దీంతో చిన్న‌కుమారుడు, ఆ త‌ల్లి మాత్ర‌మే ఆ ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే తల్లి కొంత కాలంగా క‌నిపించ‌డం లేద‌ని పెద్ద కుమారుడికి తెలిసింది. ఆయ‌న త‌ల్లి నివసిస్తున్న ఇంటికి వ‌చ్చాడు. దీంతో  ఓ ఘోరం బ‌య‌ట‌ప‌డింది. ఓ ప్లాస్టిక్ డ్ర‌మ్ములో తల్లి మృత‌దేహం ఉన్న‌ట్టు తెలుసుకొని షాక్ కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

త‌మిళనాడు రాజ‌ధాని చైన్నైలోని నీలాంక‌రై ప్రాంతంలో షెన్బ‌గం అనే వృద్ధురాలు (86) నివ‌సిస్తోంది. ఆమె భ‌ర్త పేరు గోపాల్. ఆయ‌న కొంత కాలం కింద‌ట మ‌ర‌ణించారు. ఆమెకు ముగ్గురు కుమారులు ప్ర‌భు, మురుగున్, సురేష్ లు ఉన్నారు. వీరి ముగ్గురికి పెళ్లిల్లు అయ్యాయి. దీంతో ప్ర‌భు, మురుగ‌న్ లు ఇద్ద‌రు వారి ఫ్యామిలీతో క‌లిసి అదే ప‌ట్ట‌ణంలోని వివిధ ప్రాంతాల్లో నివ‌సిస్తున్నారు. కానీ చిన్న కుమారుడు సురేష్  (50) మాత్ర‌మే త‌న త‌ల్లితో, భార్య పిల్ల‌లతో క‌లిసి ఉండేవాడు. 

రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. పెరరివాలన్‌‌ విడుదలకు ఆదేశం..

ఆయ‌న‌కు మాన‌సిక ఆరోగ్యం స‌రిగా ఉండ‌దు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన భార్య, పిల్ల‌లు నెల రోజుల కింద‌ట అత‌డిని వ‌దిలిపెట్టి వేరే చోటుకు వెళ్లిపోయారు. దీంతో త‌ల్లితో క‌లిసి అత‌డు ఆ ఇంట్లోనే నివసిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి షెన్బ‌గం ఇరుగు పొరుగు ఉన్న వారికి క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యం వారు ఎలాగో పెద్ద కొడుకు తెలియ‌జేశారు. దీంతో పెద్ద కొడుకు ఆ ఇంటికి చేరుకున్నాడు. 

అయితే అత‌డిని చిన్న కుమారుడు సురేష్ ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో అత‌డు అనుమాన‌ప‌డ్డాడు. వెంట‌నే ఆయ‌న నీలాంక‌రై పోలీసుల‌కు విష‌యం చెప్పాడు. పోలీసు బృందం ఇంటికి చేరుకుంది. ఇళ్లంతా గాలించింది. అయినా ఆమె జాడ క‌నిపించ‌లేదు. దీంతో సురేష్ ను పోలీసులు ప్ర‌శ్నించ‌గా.. త‌ల్లి మృత‌దేహం డ్ర‌మ్ లో ఉంద‌ని తెలిపాడు. దీంతో పోలీసులు, అక్క‌డున్న వారంతా షాక్ అయ్యారు. అత‌డు చెప్పింది నిజామా ? కాదా ? అని తెలుసుకునేందుకు ఆ డ్ర‌మ్ ను పోలీసులు ప‌గ‌ల‌గొట్టారు. 

ఫుల్లుగా తాగి మండపానికి లేటుగా వ‌రుడు.. అత‌డితో పెళ్లి వ‌ద్ద‌ని చెప్పిన వ‌ధువు.. అక్క‌డే బంధువుల అబ్బాయితో..

అందులో షెన్బ‌గం మృత‌దేహం ఉండ‌టంతో పాటు పైన సిమెంట్ పోసి ఉంది. దీనిని అక్క‌డున్న వారంతా గ‌మ‌నించి విస్మ‌యానికి లోన‌య్యారు. వెంట‌నే పోలీసులు ఆ మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసి, పోస్టుమార్టం కోసం హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. నిందితుడిపై కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆమె చనిపోయి రెండు వారాలు  అయి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు అంచ‌నా వేశారు. అయితే సురేష్ ఇలా ఎందుకు చేశాడ‌న్న‌ది అర్థం కావ‌డం లేదు. మాన‌సిక అప‌రిప‌క్వ‌త‌తో త‌ల్లి చ‌నిపోయాక కూడా త‌న‌తోనే ఉండాల‌ని భావించాడో లేక మృత‌దేహానికి అంత్యక్రియ‌లు నిర్వ‌హించేక ఇలా చేశాడో అన్న‌ది అంతుపట్ట‌డం లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios