Asianet News TeluguAsianet News Telugu

అక్ర‌మ సంబంధాలు వ‌ద్దంటోంద‌ని భార్య‌ను చంపి.. క‌రెంటు స్థంభానికి వేలాడ‌దీసిన భ‌ర్త‌..

వివాహేర సంబంధాలు కొనసాగించవద్దని కోరిన భార్యను ఆ భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కరెంట్ పోల్ కు వేలాడదీశాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. 

The husband killed his wife and hanged her from an electric pole for having illicit relations.
Author
Patna, First Published Jul 13, 2022, 1:24 PM IST

అక్ర‌మ‌ సంబంధాలు.. వివాహ బంధం గొప్ప‌త‌నానికి మ‌చ్చను తీసుకు వ‌స్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. జీవితాంతం ప్ర‌తి విష‌యంలో ఒక్క‌రికొక‌రు తోడుగా ఉండాల్సిన భార్యభర్తలు బజారున ప‌డుతున్నాయి. కొన్ని సార్లు హత్యలు ఆత్మహత్యలకు కూడా దారి తీస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. అక్ర‌మ సంబంధం కొన‌సాగించ‌వ‌ద్ద‌ని భ‌ర్త‌ను ఆ భార్య కోరింది. దీంతో అత‌డికి కోపం వ‌చ్చింది. ఆ కోపంలో ఆమెను చంపేసి క‌రెంటు స్థంభానికి ఉరేశాడు. ఈ ఘ‌ట‌న బీహార్ లోని స‌మ‌స్తిపూర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ముస్రిఘరారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఉమాదేవికి ఓ వ్య‌క్తితో కొన్ని సంవత్స‌రాల కింద‌ట వివాహం జ‌రిగింది. 

దారుణం.. మైన‌ర్ ను గ్యాంగ్ రేప్ చేసి.. పెద్ద‌ల స‌మ‌క్షంలో పంచాయితీ పెట్టి..

కానీ కొన్ని రోజుల త‌రువాత అత‌డు మ‌రో మ‌హిళ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో పాటు కొందరు మహిళలతో అత‌డు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. దీనిని భార్య ఉమాదేవి తరచూ వ్యతిరేకించేది. దీంతో ఈ దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగేవి. ఈ క్ర‌మంలో ఆమెను భ‌ర్త త‌ర‌చూ కొట్టేవాడు. ఒక రోజు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ పెద్ద‌దిగా మారింది. దీంతో అత‌డు కోపంతో ఆమెను చంపేశాడు. దీనిని క‌ప్పిపుచ్చుకునేందుకు భార్య చావును ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించాల‌ని అనుకున్నాడు. దీంతో త‌న ఇంటికి   స‌మీపంలో ఉన్న ఓ విద్యుత్ స్థంభానికి వేలాడ‌దీశాడు. 

సామాన్యుడిపైనే స‌ర్కారు భారం.. పాలు సహా ప‌లు ఉత్ప‌త్త‌ల‌పై పెరిగిన జీఎస్టీ.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పైపైకి

ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్క‌డికి చేరుకొని మృత‌దేహాన్ని పోస్టు మార్టం కోసం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై మృతురాలి కుమారుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తన తండ్రే త‌ల్లిని చంపేశాడ‌ని చెప్పాడు. తన తండ్రి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దీనిని తల్లి తరచూ వ్య‌తిరేకించేద‌ని చెప్పాడు. దీంతో త‌ల్లిని హ‌త్య చేసి క‌రెంట్ పోల్ కు వేలాడ‌దీశాడ‌ని పోలీసుల‌కు వివరించాడు. కుమారుడి ఫిర్యాదుతో తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముశ్రీఘరి పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ పంకజ్ కుమార్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు త‌ర‌లించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios