Asianet News TeluguAsianet News Telugu

ట్రక్కును ఢీకొన్న బస్సు.. 55 మందికి గాయాలు.. ఎక్కడంటే ?

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 70 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. అయితే ఇందులో ఉన్న 55 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

The bus collided with the truck.. 55 people were injured.. where?..ISR
Author
First Published Sep 8, 2023, 3:08 PM IST

ఓ ట్రక్కును బస్సును ఢీకొంది. దీంతో 55 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో 47 మంది స్కూల్స్, కాలేజీలకు చెందిన స్టూడెంట్లే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇంటికి పంపించారు. వాడా తహసీల్ లోని దేశాయ్ గ్రామ సమీపంలో ఉదయం 6.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ ఆర్ టీసీ) అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు పాల్ఘర్ జిల్లాలోని చించ్పాడా-వాడా సర్వీసు అందిస్తోంది. ఈ బస్సులో ప్రతీ రోజు వివిధ పనుల నిమిత్తం వాడాకు వెళ్లేవారు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ ప్రయాణిస్తుంటారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం కూడా ఈ బస్సు సర్వీసు ఉదయం ప్రారంభించింది. అయితే వాడా తహసీల్ లోని దేశాయ్ గ్రామ సమీపంలోకి చేరే సరికి ఎదురుగా వస్తున్న ఓ బస్సును ఢీకొట్టింది. 

ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల మొత్తంగా 55 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందులో 47 మంది స్టూడెంట్లు ఉండగా.. మిగితా 8 మంది ఇతరులు ఉన్నారు. కాగా.. ఈ సమాచారం తెలిసిన వెంటనే క్షతగాత్రులను ప్రైవేట్ వాహనాలు, అంబులెన్స్ ల ద్వారా హాస్పిటల్స్ కు తరలించారు. వారికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని ఇంటికి పంపించారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని, ఈ బస్సులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios