రైతు ప్రతీకారం.. రెండు పులులు బలి..
ఓ రైతు ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. తన ఆవు చనిపోవడానికి కారణమైన పులులను చంపాలని భావించారు. తన ఆవు కళేబరంపై విషాన్ని పూసి ఎరగా వేశాడు. ఆ విష కళేబరాన్ని తిన్న ఆ పులులు మృత్యువాత పడ్డాయి. అలా తన ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు లోని నీలగిరి జిల్లాలోని చోటుచేసుకుంది.

ఓ రైతు తన ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన ఆవు చనిపోవడంతో చలించిపోయాడు. తన ఆవును పులి చంపిందని భావించి.. ఆ ఆవు కళేబరంపై విషాన్ని పూసి ఎరగా వేశాడు. ఆ విష కళేబరాన్ని తిన్న ఆ పులులు మృత్యువాత పడ్డాయి. అలా తన ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. అయితే.. అనుమానాస్పద స్థితిలో ఆ పులులు చనిపోవడాన్ని గుర్తించిన అటవీ అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వారి దర్యాప్తులో అసలు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు లోని నీలగిరి జిల్లాలోని చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే శేఖర్ అనే రైతుకు చెందిన ఆవు గత పది రోజుల క్రితం మేతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆ రైతు తన ఆవు కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో అతడు ఊహించని పరిణామం ఎదుర్కొన్నాడు. సమీపంలోని అడవి ప్రాంతంలో తన ఆవు కళేబరాన్ని గుర్తించారు. ఆ ఆవు చనిపోయిన స్థితిని చూసి చలించిపోయాడు. ఆవుపై తీవ్రమైన గాయాలు ఉండడంతో పులి చనిపోయిందని నిర్ధారణకు వచ్చాడు. దీంతో ఎలాగైనా తన ఆవును చంపిన పులిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఈ మేరకు చనిపోయిన తన ఆవు కళేబరానే ఎరగా వాడుకున్నాడు. ఆ ఆవు కళేబరంపై పురుగుల మందు పూశాడు. ఈ క్రమంలో ఆ విషపూరితమైన కళేబరాన్ని తిన్న.. రెండు పులులు మృత్యువాత పడ్డాయి.
శనివారం నాడు రెండు పులులు అనుమానస్పద స్థితిలో చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ ఆవు కళేబరాన్ని, పులుల సాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడం వల్లే.. రెండు పులులు చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి దీనికి కారణమైన ఆవు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రైతును విచారించగా.. తన ఆవును చంపేశాయనే.. తాను విషం పెట్టి పులులను చంపేసినట్లు ఆ రైతు అంగీకరించాడు.