గెలవడం తర్వాత.. డిపాజిట్ తెచ్చుకోండి చూద్దాం: నితీశ్ కుమార్కు సుశీల్ మోడీ సవాల్
బీహార్ సీఎం , జేడీయూ అధినేత నితీష్ కుమార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ. పూల్పూర్లో నితీశ్ పోటీ చేస్తే ఆయన ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే బీజేపీయేతర పార్టీలను కూడా ఏకం చేసే పనిని నితీశ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఉత్తరప్రదేశ్లోని పూల్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి నితీశ్ కుమార్ లోక్సభ బరిలో నిలుస్తారన్న వార్తలపై బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ స్పందించారు. 2024 ఎన్నికల్లో నితీశ్ కుమార్ గెలవరని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు నితీశ్కు పూల్పూర్లో డిపాజిట్ కూడా దక్కదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పూల్పూర్ కాకపోయినా ఉత్తరప్రదేశ్లో ఎక్కడైనా నితీశ్ కుమార్ పోటీ చేయొచ్చని మోడీ అన్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు యూపీలో అభ్యర్ధులు లేరన్న విషయం తెలిసిందేనంటూ సెటైర్లు వేశారు. గతంలో బీఎస్పీతో కలిసి పొత్తు పెట్టుకున్నారని.. అప్పుడు బీజేపీకి 62 సీట్లు వచ్చాయని సుశీల్ గుర్తుచేశారు.
కాగా... దేశంలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ప్రజలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాని తీరు భారత ప్రజాస్వామ్యం, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిపి రావాలని పలు పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయేకు గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు పార్టీలతో కలిపి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే విషయంలో దేశ రాజధాని ఢిల్లీలో పలు పార్టీల నాయకులను కలిశారు.
ALso Read:సోనియా గాంధీని కలవనున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్
ఇక ప్రస్తుతం నితీష్ కుమార్ కు సంబంధించిన ఓ పోస్టర్ వైరల్ గా మారింది. అందులో నితీష్ కుమార్ తో పాటు, సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫొటో కూడా ఆ పోస్టర్ లో ఉంది. యూపీ+ బీహార్=గయా మోడీ సర్కార్.. అంటూ పేర్కొన్న ఆ పోస్టర్ ను సమాజ్ వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రతిపక్ష ఐక్యతకు మద్దతుగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. లక్నోలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కొత్త పోస్టర్ కనిపించింది. అందులో యూపీ + బీహార్=గయా మోడీ సర్కార్ అని ఉంది. మాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఫోటో కూడా ఉంది. ఈ పోస్టర్ను సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఐపీ సింగ్ లక్నో ప్రధాన కార్యాలయంలో ఉంచారు.