ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ జరిపిందని మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే చొరబాటుదారుల ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టిందని పేర్కొంది. మీడియా కథనాలను ఖండించింది.

పాకిస్తాన్ పై భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసిందని సోమవారం రాత్రి నుంచి పలు వార్తలు చక్కలు కొట్టాయి. అయితే దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. సర్జికల్ స్ట్రైక్ జరగలేదని స్పష్టం చేసింది. కానీ జమ్మూ కాశ్మీర్ లోని బాలాకోట్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద పాకిస్తాన్ చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టిందని తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎవరికో మెసేజ్ చేసిందని.. తల్లిని దారుణంగా హతమార్చిన 17 ఏళ్ల కుమారుడు..

బాలాకోట్ సెక్టార్లోని హమీర్ పూర్ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు, దట్టమైన ఆకులు, దట్టమైన నేలను ఉపయోగించుకుని నియంత్రణ రేఖ దాటి భారత వైపునకు ప్రవేశించేందుకు ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించాయని, దీంతో దళాలు అప్రమత్తమయ్యాయని, సోమవారం ఉదయం దానిని గుర్తించాయని మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. 

Scroll to load tweet…

ఉగ్రవాదులు తమ సొంత దాడి కేంద్రాలకు చేరుకోగానే వారిని సవాలు చేసి సమర్థవంతంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని పేర్కొంది. ఈ పరిమాణాలతో ఉగ్రవాదలు తోకముడిచారని, అక్కడి నుంచి పారిపోయారని తెలిపింది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అయితే ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది నియంత్రణ రేఖ సమీపంలో నేలపై పడిపోయాడు. అనంతరం ఆర్మీ అదనపు బలగాలను రంగంలోకి దించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో మధ్యాహ్నం గాలింపు చర్యలు ప్రారంభించింది. 

రోజూ చేపలు తింటే ఐశ్వర్యరాయ్ లాంటి అందమైన కళ్లు వస్తాయ్ - మహారాష్ట్ర మంత్రి గవిత్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ ప్రాంతంలో జరిపిన సోదాల్లో రెండు మ్యాగజైన్లు, 30 రౌండ్లు, రెండు గ్రెనేడ్లు, పాక్ కు చెందిన మందులతో కూడిన ఏకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో నియంత్రణ రేఖ వైపు వెళ్లే రక్తపు మరకలు కూడా బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు సొంత దళాల కాల్పుల కారణంగా గాయపడ్డారు. అయినప్పటికీ వారు 
ఎల్సిని దాటగలిగారు, తరువాత వారు మరణించారు. కాగా.. చొరబాట్ల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని ఆర్మీ తెలిపింది.