పరిశ్రమలకు ఉపయోగపడే విద్యార్థులను తయారు చేయాలి - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
భారతదేశంలో పరిశ్రమలకు అవసరమయ్యే విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కాంచీపురంలో ఉన్న ఐఐఐటీడీఎం 10వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
దేశాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో విద్యాబోధన జరగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పరిశ్రమలకు ఏం అవసరమో భారతదేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పరిశ్రమలోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న విద్యార్థులను విద్యా సంస్థలు ఉత్పత్తి చేయాలని సూచించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం (IIITDM, కాంచీపురం), చెన్నై 10వ స్నాతకోత్సవంలో శనివారం సీతారామన్ ప్రసంగించారు. గ్లోబల్ యూనివర్శిటీలతో పోలిస్తే భారతదేశ ఉన్నత విద్య తక్కువ లేదా బలహీనమైనది కాదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను నిర్వహించడంలో భారతీయ విశ్వవిద్యాలయాలలో చదివే వ్యక్తులు రెండో అతిపెద్ద పోటీదారులు అని ఆమె చెప్పారు.
కాంచీపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ బోర్డులో సెయింట్-గోబెన్ ఇండియా ప్రాతినిధ్యం వహించడాన్ని ప్రస్తావిస్తూ.. పరిశోధనా సంస్థల బోర్డులోకి పరిశ్రమల ప్రముఖులు వస్తే, పరిశ్రమ, విద్యా సంస్థల అవసరాలు వారికి అర్థమవుతాయని చెప్పారు. ‘‘ ఇందులో పరిశ్రమల వారీగా విద్యార్థులను సిద్ధం చేసే పని చక్కగా సాగుతుంది. తద్వారా భవిష్యత్తులో ఇతర ప్రాంతాలలో కూడా భారతదేశం కొన్ని ముఖ్యమైన వస్తువుల తయారీకి భూమిగా మారుతుంది, ఈ రోజు మనం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడతాము. ఎందుకంటే ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయాలు ఉత్పత్తి, తయారీ రంగాలకు పెద్ద నష్టాలను కలిగిస్తాయి.’’ అని అన్నారు.
కృష్ణంరాజు మరణం కలచివేసింది: కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సానుభూతి
ఐక్యరాజ్యసమితి జనాభా - 2019 గణాంకాలను ప్రస్తావిస్తూ.. 2028 నాటికి భారతదేశం శ్రామిక వయస్సు జనాభా చైనాను అధిగమిస్తుందని అంచనా వేసిందని, 2036 నాటికి శ్రామిక వయస్సు జనాభా దేశం మొత్తం జనాభాలో 65 శాతం ఉంటుందని ఆమె అన్నారు. ‘‘ ఉత్పాదకత, జీడీపీ సహకారం అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. లింగ, సామాజిక తరగతులు లేదా దేనితో సంబంధం లేకుండా శ్రామిక జనాభాకు సమాన అవకాశం ఇస్తేనే అది జరుగుతుంది ’’ అని ఆమె అన్నారు.
ఎన్సీపీకి ఎదురుదెబ్బ.. శివసేన షిండే వర్గంలో చేరనున్న అశోక్ గావ్డే
భారతీయులు దాఖలు చేసిన మొత్తం పేటెంట్ల సంఖ్య 2021-22 నాటికి 66,400 కు పెరిగిందని, 2014-15 లో 42,000 తో పోలిస్తే ఇది పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. ఈ ఏడాది ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా సైన్స్, గణితంలో 750 వర్చువల్ ల్యాబ్ లు, భారతదేశానికి స్వాతంత్రం 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిమ్యులేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోసం 75 స్కిల్లింగ్ ఈ-ల్యాబ్ లను ప్రభుత్వం ప్రకటించింది.