సమాజ్వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ ఆరోగ్యం విషమం
కరోనా బారినపడిన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు లక్నోలోని మేదాంత ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్పై చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది
కరోనా బారినపడిన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు లక్నోలోని మేదాంత ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్పై చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. సీతాపూర్ జైలులో ఉన్న ఆజంఖాన్ కరోనా బారినపడడంతో ఈ నెల 9న ఆయనను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read:జయప్రదపై వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఆజాంఖాన్
గతనెల 30న తండ్రీకొడుకులిద్దరూ కరోనా బారినపడ్డారు. అయితే, ఈ నెల 9న ఆజంఖాన్ పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో తండ్రీకొడులిద్దరినీ మేదాంతాకు తరలించారు. దాదాపు వందకుపైగా కేసుల్లో నిందితులుగా ఉన్న అజాంఖాన్, ఆయన భార్య, కుమారుడు అబ్దుల్లా గతేడాది ఫిబ్రవరి నుంచి సీతాపూర్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో అలహాబాద్ కోర్టు అజామ్ ఖాన్ భార్య తజీన్ ఫాత్మాకు ఇటీవలనే బెయిల్ మంజూరు చేసింది