Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. మద్యం మత్తులో తల్లిని కొట్టి.. సజీవంగా పూడ్చేసిన కొడుకు..

మద్యం మత్తులో తల్లి మీద విచక్షణారహితంగా దాడిచేశాడో కొడుకు.. ఆమె స్పృహ తప్పడంతో చనిపోయిందనుకుని.. బతికుండగానే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు.

son drunk and attacked buried alive mother in tamilnadu
Author
First Published Nov 10, 2022, 6:40 AM IST

చెన్నై : మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి, ఆమెను సజీవంగా పూడ్చేసిన ఓ కుమారుడి ఉదంతం తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని చిట్టాపూర్ లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిత్తామూరుకు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  గొడవల కారణంగా అతని భార్య పిల్లలతో సహా పుట్టింట్లో  ఉంటుంది. ప్రస్తుతం అతను తల్లి యశోదతో  కలిసి జీవిస్తున్నాడు. తండ్రి పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. నిత్యం మద్యం తాగే అలవాటు ఉన్న శక్తివేల్.. తరచూ తల్లితో గొడవ పడేవాడు.

దీంతో భయంతో ఆమె రాత్రివేళల్లో ఎదురింట్లో నిద్రించేది. మంగళవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన శక్తివేల్ తల్లితో మరోసారి గొడవపడ్డాడు తర్వాత యశోద కనిపించలేదు. ఇరుగు పొరుగువారు ఆమె కోసం గాలించారు. శక్తివేల్ ఇంటికి తాళం వేసి ఉండటంతో.. వెనక్కి వెళ్లి పరిశీలించగా.. యశోద చీర కింద పడి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలే ఉన్న శక్తివేల్ వారిని చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతనికి స్థానికులు దేహశుద్ధి చేయగా, తన తల్లిపై తల్లిపై దాడి చేయడంతో ఆమెతలకు గాయమై, స్పృహ తప్పి పడిపోయిందని తెలిపాడు. వెంటనే ఇంటి వెనుక గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు వెల్లడించాడు. పోలీసులు వచ్చి గొయ్యిని తెరిచేలోగానే ఆమె ప్రాణాలు విడిచింది. 

యూపీలో ఘోరం.. 25 ఏళ్ల యువతిపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ సెప్టెంబర్ లో కాకినాడలో చోటు చేసుకుంది. పించన్ డబ్బుల కోసం కన్నకొడుకే తల్లి మీద దారుణానికి తెగబడ్డాడు. వృద్ధురాలని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కాళ్లతో తన్నడంతో ఆ తల్లి తీవ్రంగా గాయపడింది. కాకినాడ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కాజులూరు మండలం పల్లి గ్రామానికి చెందిన తల్లి బోయిన వెంకన్న మద్యానికి బానిసయ్యాడు. పింఛన్ డబ్బులు ఇవ్వాలంటూ తరచు తల్లి లక్ష్మి(75)ను  హింసిస్తున్నాడు.  తల్లి పీక మీద కాలు వేసి తొక్కుతూ వేధిస్తున్నాడు.  

ఆ రోజు ఉదయం వెంకన్న తల్లిపై దాడి చేస్తుండగా ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో కాకినాడ డిఎస్పి ఆదేశాల మేరకు పోలీసులు బాధితురాలిని యానాం ఆస్పత్రి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకన్న క్రూర చర్యలపై గతంలో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు భరోసా ఇవ్వడంతో బాధితురాలి పెద్ద కొడుకు సుబ్బారావు ఫిర్యాదు చేశాడని,  నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. 

కాగా, ఇలాంటి ఘటనే ఈ మేలో సిద్ధిపేటలో ఒకటి వెలుగుచూసింది. డబ్బులు ఇవ్వలేదని అక్కసు పెంచుకుని తల్లికి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. అడ్డువచ్చిన తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ విషాద ఘటన సిద్ధిపేట, జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందపూర్ లో చోటు చేసుకుంది. గోవిందా పూర్ కి చెందిన  మైసయ్య(65), పోశవ్వ (60) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. గతంలో చిన్న కుమారుడు ఓ ప్రమాదంలో చనిపోయాడు. వీరందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. 

ఈ క్రమంలో మైసయ్య తనకున్న మూడు గుంటల భూమిని అమ్మగా, రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బులో లక్ష బాలమల్లుకు ఇచ్చి తన వద్ద రూ.లక్ష  ఉంచుకున్నాడు. ఆ డబ్బు కూడా ఇవ్వాలంటూ బాలమల్లు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆరోగ్యం బాగా లేదని, ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరం ఉందని మైసయ్య ఎంత చెప్పినా కొడుకు వినిపించుకోలేదు. ఘటన జరిగిన రోజు ఉదయం ఇంటికి వచ్చి తల్లిని తీవ్రంగా చితకబాది ఆమె దగ్గర ఉన్న డబ్బుల సంచిని లాక్కున్నాడు. ఆ తర్వాత బైక్ లోంచి పెట్రోల్  తీసి.. తల్లిపై పోసి నిప్పంటించాడు. 

తీవ్ర గాయాలకు గురైన పోశవ్వ కేకలు వేయడంతో మైసయ్య ఇంట్లో నుంచి పరుగున వచ్చి  మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. బాలమల్లు కర్రతో తండ్రిపై కూడా దాడి చేసి గాయపరిచారు. గ్రామస్తులు 108లో వీరిద్దరిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో  ఆమెకు  మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైసయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios