Asianet News TeluguAsianet News Telugu

కొన్ని ఖరీదైన పెళ్లిళ్లు, దిమ్మదిరిగే నిజాలు! అతిథుల కోసం ఫ్లైట్‌లు, గిఫ్ట్‌గా హెలికాప్టర్, ప్లాటినం తాళి

పెళ్లి విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా ఉంటారు మనోళ్లు. మన దేశంలో ఖరీదైన పెళ్లిళ్లు కొన్ని నెలలపాటు హాట్ టాపిక్‌గా ఉంటాయి. అలాంటి కొన్ని ఖరీదైన పెళ్లిళ్లు.. వాటికి సంబంధించి కొన్ని షాకింగ్ నిజాల గురించి తెలుసుకుందాం.
 

some expensive indian weddings, and shocking details, helicopter as gift, platinum mangalsutras kms
Author
First Published Mar 27, 2023, 2:57 PM IST

న్యూఢిల్లీ: పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎక్కడ తక్కువైనా అదో అవమానంగా భావిస్తారు. అందుకే సంపన్నులు పెళ్లిళ్లలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అందులో ఇది లేదు అనే ఛాన్సే ఉండదు, అంతేనా.. మన కళ్లను మనమే నమ్మలేనంత ఘనంగా జరిపిస్తుంటారు. ఈ సాంప్రదాయాన్ని ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా.. మహమ్మారులు వచ్చినా ఆపలేవని పలుమార్లు మనవాళ్లు నిరూపించారు. పెళ్లి విషయంలో తగ్గేదే ల్యా అంటారు. అలాంటి కొన్ని పెళ్లిల విశేషాలు, ఆశ్చర్యపరిచే నిజాలను చూద్దాం.

2016లో కర్ణాటక మాజీ గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి గురించి ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశమంతా మాట్లాడింది. అంత ఘనంగా ఆ పెళ్లి జరిగింది. అప్పుడు ఆ పెళ్లి ఖర్చు సుమారు రూ. 500 కోట్లు. ఈ పెళ్లి వేడుకకు ఆహ్వానం పలికే ఎంట్రెన్స్ దగ్గర రెండు పెద్ద ఏనుగుల(కృత్రిమమైనవి)ను ఏర్పాటు చేశారు. అవి వాటి తొండాలను గాల్లోకి లేపుతా అతిథులను ఆహ్వానించేలా ఏర్పాట్లు చేశారు. విజయనగర సామ్రాజ్యంలోని ఆచారాన్ని నేరుగా 2016లోకి తీసుకువచ్చారు గాలి జనార్ధన్ రెడ్డి. 30 ఎకరాల్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సుమారు 50 వేల మంది అతిథులు వస్తే.. 3,000 మంది సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్లు ఉన్నారు.

2018లో ముకేశ్ అంబానీ కూతురు ఇషా పెళ్లి ఆనంద్ పిరమల్‌తో జరిగింది. ఉదయ్‌పూర్‌లో ప్రీ వెడ్డింగ్ బ్యాష్‌లో సింగర్ బియాన్స్‌తో ఓ ప్రైవేటు కాన్సర్ట్ నిర్వహించారు. గెస్టులను తరలించడానికి ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో 100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్లు నిలిపారు. యూఎస్ మాజీ స్టేట్ సెక్రెటరీ హిల్లరీ క్లింటన్ హాజర్యారు. స్టీల్ మ్యాగ్నెట్ లక్ష్మీ మిట్టల్, దేవేంద్ర ఫడ్నవీస్, సచిన్ టెండూల్కర్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు వచ్చారు.

Also Read: టూత్ బ్రష్‌తో జైలు గోడకు కన్నం వేసి పారిపోయిన ఖైదీలు.. రెస్టారెంట్‌కు వెళ్లి..!

2011లో కాంగ్రెస్ లీడర్ కన్వర్ సింగ్ తన్వర్ కొడుకు లలిత్, మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ కూతురు యోగితాతో హర్యానాలో పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ఈ జంటకు వచ్చిన బహుమతులు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. వారికి హెలికాప్టర్, 21 కోట్ల క్యాష్ గిఫ్ట్‌గా వచ్చాయి. లగాన్ కార్యక్రమానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్ట్‌గా 30 గ్రాముల వెండి బిస్కెట్, సఫారీ సూట్ సెట్, ఒక శాలువా, రూ. 2,100 నగదును ఇచ్చారు.

నెల తర్వాత న్యూజిలాండ్ బిజినెస్ టైకూన్ ఎష్ రవీంద్ర హైదరాబాద్‌లో కొడుకులు ఎస్ రోహిత్, ఎస్ రంజిత్‌ల పెళ్లిళ్లు జరిపించాడు. దక్షిణ భారతదేశంలో ఇదే ఖరీదైన పెళ్లి అనే వాదనలు ఉన్నాయి. వధువులకు వారు ప్లాటినం, గోల్డ్ చైన్లను మంగళసూత్రాలుగా ఇచ్చారు. 

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు 2018లో పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పూర్‌లో ఉమ్మెద్ ప్యాలెస్‌లో వారి పెళ్లి రూ. 105 కోట్ల ఖర్చుతో జరిగింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లికి రూ. 90 కోట్లు ఖర్చైనట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios