సిసోడియాను భయంకరమైన నేరస్తుల మధ్య ఉంచారని, ఆయన హత్యకు గురయ్యే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో జైలులో అనేక హత్యలు జరిగాయని, అందుకే తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. 

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను భయంకరమైన నేరగాళ్లతో పాటు తీహార్ జైలులో ఉంచారని, ఆయన హత్యకు గురవుతారని తాము భయపడుతున్నామని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం పేర్కొంది. సిసోడియాను జైల్లో ఇతర ఖైదీలతో ఉంచుతున్నారని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భార్య కోపంగా ఉంది.. నా పరిస్థితి అర్థం చేసుకుని హోలీకి సెలవులు ఇవ్వండి సార్: పోలీసు లీవ్ లెటర్ వైరల్.. జవాబిదే

జైలు నంబర్ 1లోని 9వ వార్డులో భయంకరమైన నేరస్థుల మధ్య సిసోడియాను జైలులో ఉంచారని, ఆయన హత్యకు తాము భయపడుతున్నామని మరో నేత ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ‘‘ మొదట మా ఆరోగ్య మంత్రి (సత్యేందర్ జైన్), ఇప్పుడు మా విద్యాశాఖ మంత్రిని జైల్లో పెట్టారు. సీబీఐ నిరంతరం దాడులు చేసినా ఏమీ దొరకలేదు. ఛార్జిషీటులో సిసోడియా పేరు కూడా లేదని, అయినప్పటికీ ఆయనను ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు’’ అని ఆయన అన్నారు. ‘‘బీజేపీ కుట్రలో ఇరుక్కోవద్దని జైలు అధికారులను హెచ్చరిస్తున్నాను. జైలులో అనేక హత్యలు జరిగాయి. అందువల్ల అతడి హత్యపై తమకు అనుమానాలు ఉన్నాయి’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

మనీష్ సిసోడియాను సీనియర్ సిటిజన్ల ఉంచే తీహార్ జైలు గదిలో ఉంచామని, ఇతర ఖైదీల మాదిరిగానే ఆయనకు కూడా నిత్యావసర సరుకులు అందించామని, జైలు మాన్యువల్ ప్రకారం ఆహారం అందిస్తున్నామని అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కేసులో మార్చి 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు విధించిన కొద్దిసేపటికే ఆప్ సీనియర్ నేతను తీహార్ జైలుకు తీసుకొచ్చారు.

సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టులపై కేజ్రీవాల్ నిరసన.. హోలీ జరుపుకోకుండా ఈరోజంతా మెడిటేషన్..

ఆయనతో పాటు భగవద్గీత కాపీని తీసుకువచ్చారని, అయితే కోర్టు అనుమతించిన ఇతర వస్తువులు ఇంకా ఆయన ఇంటి నుంచి అందలేదని ‘జీ న్యూస్’ తన కథనంలో పేర్కొంది. కాగా.. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఆదివారం సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.